అంతర్జాతీయ
-బొమ్మ శివకుమార్
<!--
--> <!-- -->ఇరాన్, ఇజ్రాయెల్- అమెరికా యుద్ధం 13 రోజుకు చేరింది. అయితే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలు లక్ష్యంగా ఇరాన్ దాడులకు పాల్పడుతోంది. మరోవైపు ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై తాజాగా దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇప్పటికే ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసి వేసింది. దాంతో సంక్షోభం మరింతగా ముదిరింది. అయితే తాజాగా ఇరాన్ కొత్త సుప్రీం నాయకుడు అయతొల్లా మొజ్తాబా ఖమేనీ కీలక వ్యాఖ్యలు చేశారు. హార్ముజ్ జలసంధి మూసే ఉండాలని అన్నారు. శత్రు దేశాలపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ చర్యలు తప్పవని పేర్కొన్నారు.
తన తొలి ప్రసంగంలో అమెరికాపై మొజ్తాబా ఖమేనీ కీలక వ్యాఖ్యలు చేశారు. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను తక్షణమే మూసేయాలని, లేదంటే దాడులు మరింత తీవ్రతరం చేయాలని సూచించారు. శత్రువుల నుంచి నష్టపరిహారం తీసుకుంటామని, లేదంటే వాళ్ల ఆస్తులు ధ్వంసం కలిగి ఖమేనీ చెప్పారు. ఇరాన్ పై దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరిక. ఇక అయతొల్లా అలీ హతం తర్వాత మార్చి 9న ఇరాన్ నూతన సుప్రీం లీడర్గా మొజ్తాబా ఖమేనీ నియమితులైన విషయం తెలిసిందే.
ఇక మొజ్తాబా ఖమేనీ ప్రకటన అనంతరం ప్రపంచ చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. యుద్ధం మొదలైనప్పటి నుండి హోర్ముజ్ జలసంధి గుండా చమురు రవాణా నిలిచిపోవడంతో ధరలు పెరిగాయి. తాజాగా బ్యారెల్కు 200 డాలర్లు చేరేందుకు ఇరాన్ హెచ్చరించింది.
ఖమేనీ ఎంపికపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “అతను శాంతి యుతంగా నిర్ణయాలు తీసుకుంటాను” అని స్పష్టం చేశారు. మరోవైపు వైమానిక దాడులతో ఇరాన్ నాయకత్వాన్ని తొలగించడం సాధ్యపడదని.. అది సాధ్యపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు ఇరాన్ లోని కీలక, సైనిక మౌలిక సదుపాయాలపై అమెరికా- ఇజ్రాయెల్ దాడులు ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. యుద్ధం 13వ రోజుకు చేరింది. ఇంకా ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్ తో పాటు ఇరాన్ కూడా తన ప్రతీకార దాడులను పెంచింది. హార్మూజ్ జలసంధి ప్రాంతంలో చమురు ట్యాంకర్లపై దాడి చేస్తోంది.
ఆంగ్ల సారాంశం
యుఎస్ మరియు ఇజ్రాయెల్ స్థావరాలను నిరోధించడం, ప్రాంతీయ పొత్తులు మరియు పెరుగుతున్న మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు మరియు మానవతావాద ప్రభావాలకు వ్యతిరేకంగా పొరుగు సంబంధాల కోసం పిలుపునిస్తూ ఇరాన్ యొక్క కొత్త సుప్రీం నాయకుడు అయతుల్లా ఖమేనీ యొక్క మొదటి బహిరంగ సందేశాన్ని కథనం నివేదించింది.