seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 14 February 2026, 4:31 am Digital Edition : SEEMA KIRANAM

స్వీపర్ గా పనిచేసిన చోటే కౌన్సిలర్, బజ్జీల బండి నడిపిన సామాన్య మహిళలకు పట్టం | మున్సిపల్ ఎన్నికలు..స్వీపర్ వెంకటమ్మ, బజ్జీ బండి మహిళ వంటి సామాన్యులకు ప్రజలు పట్టం కట్టారు.

తెలంగాణ

oi-డాక్టర్ వీణా శ్రీనివాస్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఎక్కడ ఎవరు గెలిచారు? ఎందుకు గెలిచారు? అన్న చర్చ మాత్రమే కాదు, ఈ ఎన్నికలలో పోటీ చేసిన సామాన్యులకు సైతం ప్రజలు పట్టం కట్టిన తీరుపైన కూడా మాట్లాడుతున్నారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో రోడ్ల పక్కన బజిల బండి నడుపుకునే వాళ్ళు, రోడ్లు ఊడ్చిన స్వీపర్ ప్రజలు కూడా ఆదరించడం ప్రతి ఒక్కరూ చెప్పుకునేలా ఏర్పాటు చేస్తున్నారు.

ఎన్నికల మున్సిపల్‌లో ఎవరికి వారే ప్రత్యేకం

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 116 పురపాలక సంఘాలకు, ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగగా ప్రతి పార్టీ తమదైన సంచలనాలను నమోదు చేసింది. కరీంనగర్ ను హస్తగతం చేసుకుని బిజెపి, మునిసిపాలిటీలలో 13 చోట్ల విజయకేతనం ఎగురవేసి బీఆర్ఎస్, ఇక రాష్ట్రంలో అత్యధిక స్థానాలు సంపాదించి తనకే ప్రజా మద్దతు ఉందని చెప్పే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ ఎవరికి వారే తమ ప్రత్యేకతను పొందుతున్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో స్వీపర్ వెంకటమ్మ, బజ్జీ బండి మహిళ వంటి సామాన్యులకు ప్రజలు పట్టం కట్టారు

మున్సిపాలిటీలో స్వీపర్ పని చేసిన మహిళ కౌన్సిలర్

ఇదే సమయంలో అత్యంత సామాన్యులు ఈ ఎన్నికల్లో కౌన్సిలర్లుగా విజయం సాధించడం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కొన్నిచోట్ల అయితే ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తుంది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీకి చెందిన ఇంజమూరి వెంకటమ్మ 10వ వార్డు నుండి బిఆర్ ఎస్ తరపున పోటీ చేసి 317 ఓట్లతో విజయం సాధించారు. ఆమె కాంగ్రెస్ అభ్యర్థి మచ్చ వాణిపైన 10ఓట్ల తేడాతో విజయం సాధించారు.

స్వీపర్ గా పని చేసిన చోటే కౌన్సిలర్ గా

ఈమెకు ఒక ప్రత్యేకత ఉంది. నేరేడుచర్ల మున్సిపాలిటీలో గతంలో స్వీపర్ గా పని చేసింది వెంకటమ్మ. ఆమె ఇప్పుడు అదే మున్సిపాలిటీలో కౌన్సిలర్ గా అడుగుపెడుతోంది. తాను పనిచేసిన మున్సిపాలిటీలోనే ప్రజలు తనకు కౌన్సిలర్‌గా అవకాశం ఇవ్వడం పైన వెంకటమ్మ హర్షం వ్యక్తం చేశారు.

బజ్జీల బండి నడిపే మహిళకు పట్టం

ఇదిలా ఉంటే ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో కూడా ఓ మహిళ అద్భుతమైన విజయాన్ని సాధించింది. గతంలో ఇళ్లల్లో పని చేసుకున్న నాగు బాయి, ప్రస్తుతం బజ్జీల బండి పెట్టి జీవనం గడుపుతుంది. ఈ ఎన్నికలలో ఆమె 19వ వార్డు నుండి బీఆర్ఎస్ టికెట్ పైన ఎన్నికల బరిలోకి దిగి 58 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. బజ్జీలు అమ్ముకునే మహిళను కౌన్సిలర్ గా చేసిన ప్రజల పట్ల ఆమె కృతజ్ఞత వ్యక్తం చేసింది.

సామాన్యులను కౌన్సిలర్లు చేసిన ప్రజలు

ప్రజల అవసరాలను తీరుస్తూ పని చేస్తానని చెబుతోంది. సామాన్యులను ప్రజలు కౌన్సిలర్లుగా చేయడమే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగేవని చెప్పడానికి నిదర్శనం. ఇక ఇదే ప్రజాస్వామ్య స్ఫూర్తి అన్ని ఎన్నికలలో కొనసాగితే సామాన్యులు కూడా మేము సైతం అంటూ రాజకీయాలలో ముందుకు వస్తారు.

ఆంగ్ల సారాంశం

మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు సామాన్యులకు పట్టం కట్టారు. గతంలో నేరేడుచెర్ల మున్సిపాలిటీలో స్వీపర్‌గా పనిచేసిన వెంకటమ్మను ఇప్పుడు కౌన్సిలర్‌గా చేశారు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో బజ్జీలు బండి నడిపే మహిళకు ప్రజలు పట్టం కట్టారు.

Source link