ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-సయ్యద్ అహ్మద్
<!--
--> <!-- -->ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు పేర్లు మార్చి స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామాలుగా మార్చినా వాటిలో పనిచేస్తున్న ఉద్యోగుల తీరుపై ప్రభుత్వం ఇంకా అసంతృప్తిగానే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ అమరావతిలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు (చంద్రబాబు) కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా స్వచ్ఛాంధ్ర నిర్వహణ చేపడుతున్నా కొన్ని సీరియస్ నెస్ రావడం లేదని చంద్రబాబు.
స్వర్ణ వార్డు, గ్రామ కార్యాలయాల్లోని సిబ్బందిని అవసరానికి తగ్గట్టుగా వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లకు సూచించారు. పని విభజన, అవసరాన్ని బట్టి స్వర్ణ వార్డు, గ్రామ కార్యాలయాల్లో సిబ్బందిని సర్దుబాటు చేసుకోవాలన్నారు. ఇటీవల కాకినాడ, సామర్ల కోట లాంటి పట్టణాల్లో ఉన్నప్పుడు రోడ్ల పక్కన చెత్త కనిపించిందని చంద్రబాబు తెలిపారు. మున్సిపల్ కమిషనర్లు పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని ఆయన ఉంచారు.

స్వర్ణ గ్రామ, వార్డుల్లో మహిళా పోలీసుల సేవలను వినియోగించుకోవటం లేదని, ఎవరి సేవలను అవసరమున్న శాఖలను వినియోగించుకోవాలని చంద్రబాబు కలెక్టర్లకు సూచించారు. ఆర్ అండ్ బి, హెల్త్, మున్సిపల్ శాఖలకు వీరిలో ఎక్కువగా అవసరం ఉన్నట్లు చెబుతున్నారు. స్వర్ణ, గ్రామ, వార్డు కార్యాలయాల సిబ్బంది సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా.. ఆ మేరకు సర్దుబాటు చేసుకునేలా కలెక్టర్లకు అధికారాలిస్తున్నామని తెలిపారు. స్వర్ణవార్డు, గ్రామ సిబ్బంది బదిలీల సిఫార్సుల ఆధారంగా కాదు, అవసరానికి అనుగుణంగానే జరగాలి. రేషనలైజేషన్ ప్రకారమే ఈ బదిలీలు జరగాలన్నారు.