seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 11 March 2026, 7:04 am Digital Edition : SEEMA KIRANAM

స్పీకర్ నిర్ణయంపై కేటీఆర్: దానం, కడియంకు క్లీన్ చిట్టా ? కేటీఆర్ షాకింగ్ ..! | ఫిరాయింపు ఎమ్మెల్యేలను దానం నాగేందర్, కడియం శ్రీహరిపై స్పీకర్ క్లియర్ చేసిన తర్వాత కేటీఆర్ ఔట్

తెలంగాణ

ఓయ్-సయ్యద్ అహ్మద్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ (danam nagender), కడియం శ్రీహరి (kadiam srihari)కి క్లీన్ చిట్ ఇస్తూ స్పీకర్ ప్రసాద్ కుమార్ (telanana assembly Speaker) తాజాగా నిర్ణయం తీసుకున్నారు. వీరిపై బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్లను ఆయన తోసిపుచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (కేటీఆర్) తీవ్రంగా స్పందించారు. ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా క్లీన్ చిట్ ఇవ్వడమేంటని ప్రశ్నించారు.

పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి లకు స్పీకర్ క్లిన్ చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడి అంటూ స్పీకర్ నిర్ణయం వెలువడగానే కేటీఆర్ ఇవాళ ఎక్స్ లో ట్వీట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్ ఇవ్వడం అంటే ప్రజల తీర్పును అవమానించడమే అన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజుగా ఆయన అభివర్ణించారు.

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ క్లియరెన్స్ ఇచ్చిన కేటీఆర్ దానం నాగేందర్ కడియం శ్రీహరి

ఇది కేవలం ఒక తీర్పు కాదు, అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా రాజ్యాంగ వ్యవస్థలను ఉపయోగించే ఉదాహరణ అని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజల ఓట్లతో గెలిచిన పదవులను వ్యక్తిగత లాభాల కోసం మార్చుకుంటే, స్పీకర్ దానిని వేస్తే – ప్రజాస్వామ్యం ఎక్కడ నిలుస్తుందని ఆయన ప్రశ్నించారు. ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్త ఇలాంటి. పైనాల్ గా తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు, సరైన సమయంలో సమాధానం చెబుతారంటూ కేటీఆర్ తన ట్వీట్ ముగించారు.

Source link