తెలంగాణ
ఓయ్-సాయి చైతన్య
<!--
--> <!-- -->ముఖ్యమంత్రి రేవంత్ లక్ష్యంగా మాజీ మంత్రి హరీష్ సంచలన ఆరోపణలు చేసారు. మూసీ సుందరీకరణ పేరుతో రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దోపిడీకి గురైంది. రేవంత్ వేసే ప్రతి అడుగు వెనుక భూ కబ్జాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారమే అని అన్నారు. పేదల కు డబ్బులు లేవని చెప్పే ముఖ్యమంత్రికి.. వందల కోట్లతో క్యాంపు ఆఫీసులకు పైసలు ఎక్కడివని ప్రశ్నించారు. హైదర్షా కోటలో మూసీ బాధితుల కుటుంబాలకు భరోసాగా ఉంటామని హామీ ఇచ్చారు.
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పేరుతో ఇండ్లు కోల్పోతున్న మధు పార్క్ అపార్ట్మెంట్ బాధిత కుటుంబాలను పార్టీ నేతలతో కలిసి హరీష్ పరామర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీ కరణ పనులు చేపడుతోందని.. అవసరమైతే కేసీఆర్ ఈ అపార్ట్మెంట్కు వస్తారని చెప్పారు. ఈ అపార్ట్మెంట్కు గతంలో కేసీఆర్ మూడుసార్లు వచ్చారని పేర్కొన్నారు. ఆ నివాస భవనం వారికి ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ పేదల బతుకులను కూల్చవద్దని ఆయన హితవు పలికారు. కేసీఆర్కు మధు పార్క్ అపార్ట్మెంట్తో మర్చిపోలేని అనుబంధం ఉందని హరీశ్రావు తెలిపారు. కేసీఆర్ ఈ అపార్ట్మెంట్కు మూడుసార్లు వచ్చారని.. టీఆర్ఎస్ పార్టీ పాలసీ విజన్ డాక్యుమెంట్ను ఇక్కడి వార్ రూముల్లో కూర్చునే తయారు చేశారని గుర్తుచేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక.. ఇక్కడ మంచినీళ్లు లేక మీరు అపార్ట్మెంట్ ఖాళీ చేసి వెళ్లిపోతామంటే, అప్పటికప్పుడు హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులను డ్రగ్స్ ప్రత్యేక పైపులైన్ వేశారు. అప్పటి హోంమంత్రి నాయిని నరసింహారెడ్డితో బటన్ ఆన్ చేసి మరీ మీకు నీళ్లు ఇచ్చారు.

బాధితులకు అండగా నిలుస్తాం
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఈ అపార్ట్మెంట్ వారిని కాంగ్రెస్ సర్కార్ ఇబ్బంది పెట్టింది. పేదలకు అండగా ఉండాలని కేసీఆర్ తమను ఇక్కడకు పంపించారని చెప్పారు. బీఆర్ఎస్ పాలసీ డాక్యుమెంట్ కోసం కేసీఆర్ ఇక్కడి నుంచే ప్రణాళికలు సిద్ధం చేశారు. కేసీఆర్ ఈ అపార్ట్మెంట్ను నిలబెట్టే ప్రయత్నం చేశారు.. రేవంత్ని కూల్చేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా కేసీఆర్ పనిచేశారని చెప్పారు. మూసీ మురికి పోవాలని బీఎస్ ఎప్పుడో పని ప్రారంభించింది. రూ. 4000 కోట్లతో ఎస్టీపీలను నిర్మించామని చెప్పారు. గోదావరి జలాలు మూసీకి తీసుకురావాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. రేవంత్రెడ్డి ఏది చేసినా.. భూముల పంచాయతీ, రియల్ ఎస్టేట్ చేస్తారని. మూసీ సుందరికీరణ పేరుతో పెద్ద కాంట్రాక్టర్లకు రేవంత్ ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే. అసెంబ్లీలో అపార్ట్మెంట్ వాసుల తాము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని హరీశ్ రావు చెప్పారు.
ఆంగ్ల సారాంశం
హైదర్కోట టిప్పుఖాన్ వంతెన సమీపంలోని నిర్మాణాల కూల్చివేతపై హరీశ్రావు కీలక వ్యాఖ్యలు చేశారు, సీఎం రేవంత్కి సూచన