Thursday, March 5, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణషాకింగ్ న్యూస్: పదో తరగతి పరీక్షలు రద్దు | ప్రాంతీయ సంక్షోభం మధ్య పశ్చిమాసియాలో cbse...

షాకింగ్ న్యూస్: పదో తరగతి పరీక్షలు రద్దు | ప్రాంతీయ సంక్షోభం మధ్య పశ్చిమాసియాలో cbse 10వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేసింది – కీలక నిర్ణయం ఇప్పుడు ప్రకటించబడింది

📰 Generate e-Paper Clip


అంతర్జాతీయ

ఓయ్-బొమ్మ శివకుమార్

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకున్న విషయం తెలిసిందే. ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ తరగతి దేశాల్లో పదో పరీక్షలపై సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల భద్రత దృష్ట్యా పది పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షలు మార్చి 7 నుంచి మిడిల్ ఈస్ట్ లోని పలు ప్రాంతాల్లో ప్రారంభం కానున్నాయి. అయితే ఈ పరీక్షలను రద్దు చేసింది. ఇక 12వ తరగతి పరీక్షలు మార్చి 7 నుంచి ప్రారంభం కానుండగా అవి కూడా వాయిదా పడ్డాయి.

పశ్చిమాసియా దేశాల్లో పదో తరగతి పరీక్షలపై సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా దాడుల నేపథ్యంలో పశ్చిమాసియా దేశంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ సిబిఎస్‌ఈ కీలక నిర్ణయం తీసుకుంది. బహ్రెయిన్‌, ఇరాన్, కువైట్‌, ఒమన్‌ దేశాల్లో సీబీఐ పరీక్షలను రద్దు చేసింది. అలాగే ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈలోనూ సీబీఐ పదోతరగతి పరీక్షలు రద్దు అయ్యాయి. ఇక పశ్చిమాసియా దేశాల్లోని పదో తరగతి విద్యార్థుల పరీక్షలను విడిగా నిర్ణయించామని బోర్డు స్పష్టం చేసింది. విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సూచనలు.

ప్రాంతీయ సంక్షోభం మధ్య పశ్చిమాసియాలో CBSE 10వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు చేసింది, ఇప్పుడు కీలక నిర్ణయం ప్రకటించబడింది

మరోవైపు ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. శనివారం ప్రారంభమైన దాడులు ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతితో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్ సైతం ఇజ్రాయెల్ తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులను తీవ్రతరం చేస్తోంది. యూఏఈ, కువైట్, ఖతార్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, సాయిప్రస్, ఇరాక్‌, జోర్డాన్‌ తదితర దేశాలపై క్షిపణులు, డ్రోన్‌లతో విరుచుకుపడుతోంది. అయితే ఈ దాడుల్లో ఇప్పటిదాకా దాదాపు 1200 మంది కంటే ఎక్కువ మంది మృతి చెందినట్లు ఇరాన్ ప్రకటించింది.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular