హెల్మెట్.. వాహన చోదకులకు రక్షణ కవచం
కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎం.శ్రీహర్ష
కర్నూలు ప్రతినిధి, ఫిబ్రవరి 20, (సీమకిరణం న్యూస్):
వాహన చోదకులకు హెల్మెట్ ప్రాణ రక్షణ కవచమని కర్నూలు ప్రగతి సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎం.శ్రీహర్ష పేర్కొన్నారు. శుక్రవారం కేపియస్ కార్యాలయంలో మున్సిపల్ కార్మికులకు హెల్మెట్ లు పంపిణీ చేశారు. రహదారి ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి వాహనదారుడు నిర్లక్ష్యం వీడి తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరారు. గత కొంతకాలంగా రోడ్డు ప్రమాదాలపై కర్నూలు ప్రగతి సమితి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు.

