seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 22 February 2026, 9:17 am Digital Edition : SEEMA KIRANAM

శరద్ పవార్ కు తీవ్ర అనారోగ్యం, హుటాహుటిన హాస్పిటల్ కు | డీహైడ్రేషన్‌ కారణంగా ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండడంతో పుణె ఆస్పత్రిలో చేరినట్లు వైద్యులు తెలిపారు.

భారతదేశం

ఓయి-లింగారెడ్డి గజ్జల

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

పవార్ కుటుంబానికి కాలం కలిసి రావడం లేదు. రాజకీయంగా, వ్యక్తిగతంగా ఆ కుటుంబాన్ని వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. ఇటీవలే మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక నేత అజిత్ పవార్ కన్నుమూయడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆ పెద్ద లోటు నుండి పవార్ కుటుంబ సభ్యులు, అనుచరులు ఇంకా తేరుకోకముందే, ఇప్పుడు ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఆరోగ్యం మళ్లీ క్షీణించడం ఆందోళనను రెట్టింపు చేస్తోంది. వయసు పైబడటం ఒకవైపు, కుటుంబంలో జరిగిన విషాద ఘటనల తాలూకు ఒత్తిడి మరోవైపు ఆయన ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నట్లు కనిపించింది.

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం ఆయన స్వల్ప డీహైడ్రేషన్‌తో పుణెలోని ప్రైవేట్ ఆసుపత్రి (రూబీ హాల్ క్లినిక్)లో చేరారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

డీహైడ్రేషన్‌ కారణంగా ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండడంతో పుణె ఆస్పత్రిలో చేరినట్లు వైద్యులు తెలిపారు.

శరద్ పవార్ ఆరోగ్యం నిలకడగానే ఉంది: వైద్యులు

85 ఏళ్ల శరద్ పవార్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని రూబీ హాల్ క్లినిక్ వైద్యులు నిర్ధారించారు. ఆయనకు డీహైడ్రేషన్ కారణంగా ఇంట్రావీనస్ ద్రవాలు (IV ఫ్లూయిడ్స్) ఆఫర్ట్లు చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పర్వేజ్ గ్రాంట్ తెలిపారు. “ప్రస్తుతం ఆయన పరిస్థితి స్థిరంగా ఉంది. మరో రెండు రోజుల పాటు ఆసుపత్రిలో పరిశీలనలో ఉంచి, ఆ తర్వాత డిశ్చార్జ్ చేస్తాం” అని వైద్యులు వివరించారు. డాక్టర్ పర్వేజ్ గ్రాంట్‌తో పాటు కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ అభిజిత్ లోధా ఆయనకు చికిత్స అందించారు.

పది రోజుల వ్యవధిలో రెండోసారి..

శరద్ పవార్ కొద్ది రోజులుగా వరుసగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. తీవ్రమైన దగ్గు, గొంతు ఇన్‌ఫెక్షన్‌ (ఛాతీ ఇన్‌ఫెక్షన్) కారణంగా ఫిబ్రవరి 9న ఇదే ఆసుపత్రిలో చేరిన ఆయన, చికిత్స అనంతరం ఫిబ్రవరి 14న డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరుకున్నారు. అయితే, వారం తిరగకముందే మళ్లీ డీహైడ్రేషన్ బారిన పడడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పవార్ ఆరోగ్యం గురించి ఆయన కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే ఆసుపత్రి వర్గాలతో చర్చిస్తున్నారు. రాజకీయ ప్రముఖులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

ఆంగ్ల సారాంశం

డీహైడ్రేషన్ కారణంగా ఎన్సీపీ ఎస్పీ అధినేత శరద్ పవార్ పూణెలోని రూబీ హాల్ క్లినిక్‌లో చేరారు. 85 ఏళ్ల వృద్ధుడి పరిస్థితి నిలకడగా ఉందని, ఆయన పరిశీలనలో ఉన్నారని వైద్యులు ధృవీకరించారు. ఛాతీ ఇన్‌ఫెక్షన్‌కు చికిత్స తర్వాత ఫిబ్రవరి 14న ఆయన ఇటీవల డిశ్చార్జ్ అయిన తర్వాత ఇది జరిగింది.

Source link