seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 14 February 2026, 9:02 am Digital Edition : SEEMA KIRANAM

వ్యవసాయ బడ్జెట్ లో రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్, కొత్తగా ఇక..!! | వ్యవసాయ బడ్జెట్ 2026-27 అసెంబ్లీలో సమర్పించబడింది, అన్నదాత సుఖీభవ, వ్యవసాయ రంగానికి ప్రధాన కేటాయింపులు

[ad_1]

ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-సాయి చైతన్య

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

ఏపీ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్దికంగా తోడ్పాటు అందజేయబడింది. ప్రతీ రైతుకు మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. వ్యవసాయం లాభసాటిగా మారితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని, దాని ద్వారానే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని వివరించారు. ఏపీ వ్యవసాయ బడ్జెట్‌ రూ.53,752 కోట్లుగా మంత్రి ప్రతిపాదించారు. రైతు సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలను వివరించారు.

ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో 2026-27 ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఆర్దిక మంత్రి పయ్యావుల కేశవ్ సాధారణ బడ్జెట్ ను ప్రతిపాదించిన తరువాత అచ్చెన్నాయుడు వ్యవసాయ – అనుబంధ రంగాల కేటాయింపులను వివరించారు. అందులో భాగంగా ధాన్యం సేకరణకు సంబంధించి రూ.1,674 కోట్ల బకాయిలు అందించబడ్డాయి. పెట్టుబడి రాయితీ కింద రూ.310 కోట్లు, వ్యవసాయ యంత్రీకరణలో 50 శాతం రాయితీతో రూ.136 కోట్లు, భూసారాన్ని అంచనా వేయడానికి 6 లక్షల భూసార పరీక్ష పత్రాలను అందజేస్తున్నామని వివరించారు. ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమంతో 18 లక్షల మంది రైతులకు విస్తరణ సేవలు అందిస్తున్నారు. 80 శాతం రాయితీ కింద రూ.90.4 కోట్లతో 1,130 డ్రోన్ కేంద్రాలు, రూ.182 కోట్ల రాయితీతో విత్తనాలు సరఫరా, పంటలను కాపాడేందుకు రైతులకు అన్నివిధాలుగా సాయం ప్రకటించింది. సాగునీటి సౌకర్యాల కల్పనకు బిందు సేద్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు.

వ్యవసాయ-బడ్జెట్-2026-27-అసెంబ్లీలో-అన్నదాత-సుఖీబావ-ఫార్మి కోసం-ప్రధాన కేటాయింపులు-ప్రజలు

రైతుల కోసం కొత్త నిర్ణయాలు అమలు

వ్యవసాయ రంగం వృద్ధి రేటు 7.83 శాతంగా మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. PM కిసాన్ పథకం కింద రూ.6,309 కోట్లు చెల్లింపులు జరిగాయి. 2026-27లో రూ.6,600 కోట్లు PM కిసాన్‌ కోసం కేటాయించగా.. ఇప్పుడు కొంత మేర పెంచారు. రాష్ట్ర ఆర్థిక రంగానికి స్తంభంగా వ్యవసాయం నిలిచిపోయింది. దేశ వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ వాటా 10 శాతం గా చెప్పారు. 11 వ్యవసాయ పంటలను గ్రోత్ ప్రక్రియలుగా గుర్తించామని.. 24 గంటల్లో 9వేల కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ చేశామని వివరించారు. వ్యవసాయం లాభసాటిగా మారితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతోంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటేనే రాష్ట్రం ఆర్థికంగా సుభిక్షం అవుతుందని చెప్పారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటల సాగు, అగ్రి టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా వ్యవసాయ రంగాన్ని గుర్తించామన్నారు. వ్యవసాయ రంగం వృద్ధి రేటు 7.83 శాతం సాధించింది. పంటలను కాపాడేందుకు రైతులకు అన్ని విధాలుగా సాయం అందిస్తామని చెప్పారు. 80 శాతం రాయితీతో రూ.90.4 కోట్లతో.. 1,130 డ్రోన్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రూ.182 కోట్ల విత్తనాలు సరఫరా చేశామని మంత్రి పేర్కొన్నారు.

[ad_2]

Source link