seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 09 February 2026, 2:31 pm Digital Edition : SEEMA KIRANAM

వ్యభిచారం చేస్తేనే ఇంట్లో ఉంచుతాం! అత్తింటి కిరాతకానికి పసికందు తల్లి సూసైడ్! | బీదర్ హర్రర్, అత్తమామలు బలవంతంగా వ్యభిచారంలోకి దింపిన మహిళ ఆత్మహత్య, ముగ్గురిలో భర్త

భారతదేశం

ఓయ్-జక్కీ మహేష్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

కర్ణాటక బీదర్ జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంతకు ముందు అదనపు కట్నం కోసం వేధించే అత్తమామలను చూశాం కానీ.. ఏకంగా కట్టుకున్న భార్యను వ్యభిచార కూపంలోకి నెట్టాలని కిరాతక అత్తింటి వారి కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. అత్తింటి వేధింపులు తాళలేక 22 ఏళ్ల వివాహిత బలవన్మరణానికి గురైన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

అసలేం జరిగిందంటే?
బీదర్ జిల్లా భాల్కి తీసుకున్న అంజనాబాయి(22)కి, బసవకల్యాణ్‌కు చెందిన శేఖర్ పాటిల్‌తో 2022తో వివాహమైంది. వివాహ సమయంలో కన్నవారు తమ స్తోమతకు తగ్గట్టుగా లాంఛనాలు పూర్తి చేసి పంపారు. పెళ్లయిన కొత్తలో కాపురం సజావుగానే సాగింది. వీరికి ప్రస్తుతం 11 నెలల పసికందు కూడా ఉంది. అయితే బసవకల్యాణ్‌లోని ఓం కాలనీలో ఈ కుటుంబంలో గత కొంతకాలంగా గొడవలు మొదలయ్యాయి.

బీదర్‌లో అత్తమామలు బలవంతంగా వ్యభిచారంలోకి దింపిన బీదర్‌ మహిళ భర్త ఆత్మహత్యకు పాల్పడిన ముగ్గురిలో ముగ్గురు అరెస్ట్‌

వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి
అంజనాబాయి మృతిపై ఆమె తండ్రి విజయ్‌కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లయిన కొన్నాళ్ల నుంచే భర్త, అత్తమామలు ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించడం మొదలుపెట్టారు. అంతటితో ఆగక అంజనాబాయిని బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టాలని వారు పన్నాగం పన్నారు. పరాయి పురుషులతో అక్రమ సంబంధాలు పెట్టుకోవాలని, వారితో వెళ్లాలని ఆమెపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు.

నిరాకరించినందుకు చిత్రహింసలు
అత్తింటి వారు చెప్పిన అసభ్యకరమైన పనులకు అంజనాబాయి ససేమిరా అని నిరాకరించింది. పవిత్రమైన బంధంతో అడుగుపెట్టిన ఇంట్లో ఇలాంటి అరాచకాలు చేయనని తెగేసి చెప్పింది. దీంతో ఆగ్రహించిన భర్త, అత్తమామలు ఆమెపై కిరాతకంగా దాడులు చేయడం. ప్రతిరోజూ నరకం చూపిస్తూ, మానసిక క్షోభకు గురిచేశారు. ఆ పసికందు ముఖం చూసిన వారు మారతారేమో అని వేచి చూసిన అంజనాబాయికి, చివరకు మృత్యువే శరణ్యమనిపించింది. సోమవారం ఉదయం తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆమె ఆత్మహత్య చేసుకుంది.

ముగ్గురు నిందితుల అరెస్ట్
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చేరుకున్నారు. తండ్రి విజయ్‌కుమార్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా బసవకల్యాణ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన భర్త శేఖర్ పాటిల్‌తో పాటు మరో ఇద్దరు కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ముగ్గురు నిందితులు పోలీసు కస్టడీలో ఉన్నారు. కన్నకూతురిని పొట్టనబెట్టుకున్న కిరాతకులను కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

ఆంగ్ల సారాంశం

కర్ణాటకలోని బీదర్‌లో బీదర్ హర్రర్ అనే 22 ఏళ్ల యువతి తన భర్త మరియు అత్తమామలు బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారని ఆరోపిస్తూ ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె భర్త సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Source link