seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 01 March 2026, 2:27 am Digital Edition : SEEMA KIRANAM

వేట్లపాలెంలో భారీ పేలుడు.. 20 మంది సజీవదహనం | కాకినాడ జిల్లాలో బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు; 18 మంది కాలిపోయారు, పలువురు గాయపడ్డారు

ఆంధ్ర ప్రదేశ్

ఓయి-లింగారెడ్డి గజ్జల

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

కాకినాడ జిల్లాలో విషాదకర ఘటన జరిగింది. సామర్లకోట ఉన్న వేట్లపాలెం పరిధిలో గోదావరి కాలువ సమీపంలో ఉన్న సూర్యశ్రీ ఫైర్‌వర్క్స్ బాణసంచ తయారీ యూనిట్‌లో శనివారం మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో ఆకస్మికంగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. భారీగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతమంతా దట్టమైన పొగతో కమ్ముకుంది. ఘటన స్థలంలో మృత దేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ప్రమాద సమయంలో 35 మంది వరకు అక్క పనిచేస్తున్నారని సమాచారం

పేలుడు తీవ్రత దాదాపు ఐదు కిలోమీటర్ల దూరం వరకు వినిపించిందని స్థానికులు తెలిపారు. శబ్ద ప్రభావంతో సమీపంలోని ఒక ప్రైవేట్ పాఠశాల భవన స్లాబ్‌లో పగుళ్లు ఏర్పడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్లతో ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎనిమిది మందిని అంబులెన్స్‌ల ద్వారా ఆసుపత్రులకు. మృతుల్లో ఎక్కువ మంది మహిళల ప్రాథమిక సమాచారం సూచిస్తోంది.

మృతుల వివరాలు..

బాణసంచా పరిశ్రమను అడపా నాని కుటుంబ సభ్యులు ఉన్నారు. మృతుల్లో ఇప్పటి వరకు 11 మంది మృతదేహాలను పోలీసులు గుర్తించారు. మృతులను ఆడబాల శ్రీను, కడింపల్లి కృపమ్మ, కడింపల్లి ధనరాజు, సాధనాల సత్యవేణి, వట్లూరి రవి, మందపల్లి చిన్ని, నిమ్మద కరుణ, గంపల మంగ, గొడతా మహేశ్‌, గొడతా రాము, గొడతా నానిగా పోలీసులు గుర్తించారు. ఇంకా కొద్ది మంది మృతదేహాలను గుర్తించాల్సి ఉంది.

కాకినాడ జిల్లా బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు, 18 మంది సజీవ దహనం పలువురికి గాయాలు

పేలుడు సంభవించిన సమయంలో భారీ శబ్దం రావడంతో పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న వారికీ అక్కడి పరిస్థితి హృదయ విదారకంగా కనిపించింది. కొన్ని మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో గుర్తింపు పొందడం సవాలుగా మారింది.

స్థానికుల ప్రకారం, పరిమితికి మించి బాణసంచా తయారీ జరగడం ఈ ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఘటన గల అసలు కారణాలపై అధికారిక వివరాలు వెలువడాల్సి ఉంది.

సీఎం చంద్రబాబు దిగ్బ్రాంతి..

ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హుటాహుటిన అధికారులతో సమీక్షించారు. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్న ఆయనకు ప్రమాద సమాచారం అందడంతో, అక్కడ నుంచే ఆయనతో ఫోన్ మాట్లాడి పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఏమిటి, సంఘటనలో సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి. ఆ సమయంలో సూర్య ఫైర్ వర్క్స్‌లో సుమారు 20 మంది వరకు పని చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో బాణసంచా నిర్మాతలు ప్రాణాలు కోల్పోవడం పట్ల ముఖ్యమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మంత్రులు, అధికారులు తక్షణమే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక జిల్లా చర్యలను పర్యవేక్షించాలని ఇప్పటికే ఎస్పీ, కలెక్టర్ ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

ఇదిలా ఉండగా, కాకినాడలో జరిగిన ఈ పేలుడు ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం విషాదకరమని, కార్మికుల మరణం తనను తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేసి, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

పేలుడు ప్రభావంతో చుట్టుపక్కల ఇళ్లు దెబ్బతినడం దురదృష్టకరమని ఆయన అంచనా. గాయపడిన వారికి ఉత్తమ వైద్యం అందేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఆంగ్ల సారాంశం

కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో బాణాసంచా తయారీ యూనిట్‌లో జరిగిన భారీ పేలుడులో 18 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు.

Source link