seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 14 March 2026, 2:00 pm Digital Edition : SEEMA KIRANAM

విసాలపై ఖుషీ న్యూస్ | భారతదేశంలోని విదేశీయులు 30 రోజుల పాటు వీసా పొడిగింపులు మరియు పశ్చిమాసియా అంతరాయాల మధ్య ఓవర్‌స్టే మాఫీని పొందుతారు

భారతదేశం

ఓయ్-చంద్రశేఖర్ రావు

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

ఇరాన్‌పై దాడుల అనంతరం కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ వరకు ఇది పరిమితం కాలేదు. గల్ఫ్ దేశాలకూ పాకింది. యుద్ధం 15వ రోజుకు చేరుకోగా దీనికి ముగింపు కనపించట్లేదు. గల్ఫ్ ప్రాంతంలో ఇంధన సరఫరాలు, అంతర్జాతీయ ప్రయాణాలు, భద్రతకు తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్నాయి. ఇది అనేక దేశాల్లో వేలాది మంది ప్రయాణికులను చిక్కుకుపోయేలా చేస్తోంది.

ఈ యుద్ధంలో ఇప్పటివరకు 2,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది ఇరాన్‌లోనే కాగా, లెబనాన్, గల్ఫ్ దేశాల్లో కూడా మరణాలు నమోదయ్యాయి. దశాబ్దాల తర్వాత తొలిసారిగా గల్ఫ్ ప్రాంతం యుద్ధ ముఖద్వారంలో నిలిచింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు.

భారతదేశంలోని విదేశీయులు 30 రోజుల పాటు వీసా పొడిగింపులు మరియు పశ్చిమాసియా అంతరాయాల మధ్య ఓవర్‌స్టే మాఫీని పొందుతారు

యుద్ధం కారణంగా భారత్‌లో చిక్కుకుపోయిన విదేశీయులకు 30 రోజుల వీసా గడువు పొడిగించారు. గడువు దాటిన తర్వాత కూడా భారత్ లో నివసించడానికి వారికి అనుమతి లభించింది. ఇది 30 రోజుల పాటు అమలులో ఉంటుంది. ఆ తర్వాత పరిస్థితులను బట్టి దీన్ని పొడిగించాలా వద్దా అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. గడువు దాటిన తర్వాత కూడా ఇక్కడ నివసించే విదేశీయులకు విధించే జరిమానాలు కూడా రద్దు చేయబడ్డాయి.

పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల వల్ల ప్రయాణ అంతరాయాలతో ఇబ్బందులు పడుతున్న వారికి ఈ నిర్ణయం ఊరటనిచ్చింది. దుబాయ్‌లోని భారత కాన్సులెట్ జనరల్ ఈ ఉపశమన చర్యల గురించి. గల్ఫ్ సంఘర్షణ వల్ల విమాన సర్వీసులు నిలిచిపోవడంతో భారత్‌ను వీడలేని ప్రయాణికులకు వెసలుబాటు కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. యుద్ధం కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు దెబ్బతిన్న నేపథ్యంలో ఈ మినహాయింపులు అమలవుతాయి.

దుబాయ్ లోని భారత కాన్సులెట్ ఈ వివరాలు. గడువు లేదా ముగిసిన త్వరలో ముగియనున్న అన్ని వీసాలు/ఇ-వీసాలన్నీ కూడా ఫారినర్స్ రీజినల్ కాంబినేషన్ కార్యాలయాల ద్వారా వ్యక్తిగత కేసుల ఆధారంగా నెల రోజుల పాటు ఉచితంగా పొడిగించినట్లు ప్రకటించారు. పశ్చిమాసియా పరిణామాల వల్ల గడువు తీరిన తర్వాత కూడా భారత్‌లో నివసించే విదేశీయులపై విధించిన జరిమానాలు రద్దు చేసినట్లు వివరించింది.

ప్రభావిత విదేశీయులకు ఎగ్జిట్ పర్మిట్లు అందజేయడానికి కాన్సులెట్ జారీ. వీటిని దరఖాస్తు చేయకపోవడం లేదా వీసా పొడిగింపును కోరకపోవడం వలస చట్టాల ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. భారత్ కు మళ్ళించిన విమానాల ప్రయాణికులకు తాత్కాలిక ల్యాండింగ్ పర్మిట్లను సైతం భారత్ ఉచితంగా అందిస్తుంది.

ఆంగ్ల సారాంశం

భారతదేశంలోని విదేశీయులు 30 రోజుల పాటు వీసా పొడిగింపులు మరియు పశ్చిమాసియా అంతరాయాల మధ్య ఓవర్‌స్టే మాఫీని పొందుతారు. ప్రయాణ అంతరాయాల కారణంగా దేశంలో చిక్కుకుపోయిన విదేశీ పౌరులకు ఒక నెల వీసా పొడిగింపులను మరియు ఓవర్‌స్టే జరిమానాలను మాఫీ చేస్తామని భారతదేశం శుక్రవారం ప్రకటించింది.

Source link