Wednesday, April 1, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణవిశాఖ వాసులకు శుభవార్త.. అక్కడ మరో కొత్త మెడికల్ కాలేజ్ ఇస్తున్న కేంద్రం! | విశాఖ...

విశాఖ వాసులకు శుభవార్త.. అక్కడ మరో కొత్త మెడికల్ కాలేజ్ ఇస్తున్న కేంద్రం! | విశాఖ ప్రజలకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. విశాఖలో ఈఎస్‌ఐఎస్‌ ఆస్పత్రిని మెడికల్‌ కాలేజీగా అప్‌గ్రేడేషన్‌

📰 Generate e-Paper Clip


ఆంధ్ర ప్రదేశ్

oi-డాక్టర్ వీణా శ్రీనివాస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఏపీలో మౌలిక సదుపాయాల కల్పన పైన దృష్టిసారించి రోడ్లు, రవాణా సౌకర్యాలకు భారీ బడ్జెట్లను కేటాయించిన కేంద్రం ఏపీలో వైద్య వ్యవస్థను పటిష్టం చేయడానికి కూడా తమ వంతు సహకారాన్ని అందిస్తుంది. విశాఖపట్నంలో ఉన్న ఈ ఎస్ ఐ ఆసుపత్రిని వైద్య కళాశాలగా అప్‌డేట్ చేయడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఆ ఆసుపత్రి మెడికల్ కాలేజ్ గా అప్

విశాఖపట్నంలో ఉన్న ఈఎస్ఐఎస్ ఆసుపత్రిలో అప్ చేయడం మరో కొత్త మెడికల్ కాలేజీకి రానుంది. వైద్య విద్యను, ప్రజారోగ్య సేవలను విస్తరించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగానే కనిపిస్తుంది. ఈఎస్ఐ, ఈఎస్ఐఎస్ ఆసుపత్రులను మెడికల్ కాలేజీలుగా మార్చడానికి కేంద్రం కసరత్తు చేస్తోంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి విశాఖపట్నంలోని ఈఎస్ఐఎస్ ఆసుపత్రికి ఆ అవకాశం లభించింది.

విశాఖ ప్రజలకు ఈఎస్‌ఐఎస్‌ ఆస్పత్రిని వైద్య కళాశాలగా అప్‌గ్రేడేషన్‌ చేసిన కేంద్ర ప్రభుత్వం విశాఖ ప్రజలకు శుభవార్త చెప్పింది

ఈఎస్ఐసీ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు కార్యరూపం

రాష్ట్ర బీమా అయిన ఈఎస్ఐసి ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు కార్యరూపం దాలుస్తుందని. ఇటీవల పార్లమెంటు బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాజ్యసభలో కేంద్ర కార్మిక సహాయ మంత్రి శోభ కరందాజ్లే ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. జాతీయ వైద్య మండలి నిబంధనలకు అనుగుణంగా విశాఖపట్నంలోని ఈ ఎస్ ఐ ఆసుపత్రిని అప్‌లోడ్ చేస్తున్నామని ఆమె రాజ్యసభ వేదికగా ధ్రువీకరించారు.

కేంద్రానికి అప్పగించే ప్రక్రియ ప్రారంభించిన ఏపీ సర్కార్

రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రిని అప్పగించిన వెంటనే తదుపరి చర్యలు ప్రారంభిస్తామన్నారు. దీంతో ఇప్పటికే ఈఎస్ఐఎస్ ఆసుపత్రిని కేంద్ర ప్రభుత్వానికి అప్పగించే ప్రక్రియను ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. ప్రస్తుత సిబ్బంది, నిర్వహణ ఖర్చులు, ఇతర కీలక విషయాలపై కేంద్రంతో చర్చలు సాగుతున్నాయి. ఈ అప్ గ్రేడేషన్ పనుల కోసం జనవరి నెలలో కేంద్ర ప్రభుత్వ బృందం విశాఖపట్నంలోని ఈఎస్ఐఎస్ ఆసుపత్రిని సందర్శించి పరిశీలన జరిపింది.

విశాఖపట్నం వాసులకు గుడ్ న్యూస్

ప్రస్తుతం 200 పడకలతో కొనసాగుతున్న ఈ ఆసుపత్రి మెడికల్ కళాశాలలో విశాఖపట్నం వాసులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇది మాత్రమే కాదు షీలా నగర్‌లో 400 పడకలతో మరో అత్యాధునిక యేసయ్య ఆసుపత్రి నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతుంది. ఇది కూడా విశాఖ వాసులకు శుభవార్త అంటే చెప్పాలి.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular