seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 18 March 2026, 11:22 pm Digital Edition : SEEMA KIRANAM

విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! | దక్షిణ మధ్య రైల్వే విశాఖపట్నం-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ను క్రమబద్ధీకరించింది: కొత్త షెడ్యూల్, తేదీలు ఇవే

ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-సయ్యద్ అహ్మద్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

విశాఖపట్నం (విశాఖపట్నం) నుంచి తిరుపతి (తిరుపతి) వెళ్లే ప్రయాణికులకు రైల్వే శుభవార్త చెప్పింది. ఈ రెండు నగరాల మధ్య సాధారణ ప్రయాణాలు వారితో పాటు తిరుమల దర్శనానికి వెళ్లే ప్రయాణికుల కోసం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రత్యేక రైలుగా నిర్ణీత సమయాల్లో మాత్రమే నడుపుతున్న విశాఖ-తిరుపతి-విశాఖ ఎక్స్ ప్రెస్ రైలును క్రమబద్ధీకరిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీనితో పాటు ఎప్పటి నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుంది, కొత్త సమయాలను కూడా కలిగి ఉంటుంది.

తాజా మార్పు ప్రకారం విశాఖ-తిరుపతి ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 18507 ఏప్రిల్ 6 నుంచి ప్రతీ సోమవారం ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. అలాగే తిరుపతి-విశాఖ ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 18508 ఏప్రిల్ 7 నుంచి ప్రతీ మంగళవారం ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. విశాఖ-తిరుపతి ఎక్స్ ప్రెస్ రైలు ప్రతీ సోమవారం విశాఖలో రాత్రి 7.10కి బయలుదేరి తిరుపతికి మరుసటి రోజు ఉదయం 8.35కి చేరుతుంది. అలాగే తిరుపతి నుంచి బయలుదేరే రైలు మంగళవారం రాత్రి 9.50కి బయలుదేరి మరుసటి రోజు మధాహ్నం 1.30కి విశాఖకు చేరుకుంటుంది.

దక్షిణ మధ్య రైల్వే విశాఖపట్నం-తిరుపతి ఎక్స్‌ప్రెస్ కొత్త షెడ్యూల్‌ను క్రమబద్ధీకరించింది

ఈ రెండు రైళ్లకు హాల్ట్ స్టేషన్లను కూడా రైల్వే ప్రకటించింది. ఇందులో విశాఖపట్నం నుంచి చూస్తే దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట ఉన్నాయి. ఈ రైళ్లలో సెకండ్ ఏసీ, ధర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ క్లాస్, దివ్యాంగుల బోగీలు ఉంటాయని అధికారులు తెలిపారు.

Source link