seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 16 March 2026, 8:17 pm Digital Edition : SEEMA KIRANAM

వివేకా గుండెపోటు ప్లాన్ సునీతదే ! అవినాష్ రెడ్డి సంచలనం..! | వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు

ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-సయ్యద్ అహ్మద్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (ys vivekananda reddy)హత్య జరిగి ఏడేళ్లు కావస్తోంది. ఓవైపు సీబీఐ తన దర్యాప్తు పూర్తయిందని సుప్రీంకోర్టుకు సైతం చెప్పేసింది. దీంతో ఛార్జిషీట్ దాఖలు చేసి విచారణ పూర్తి చేయాలనే ఆదేశాలు కూడా సుప్రీంకోర్టు ఇచ్చింది. ఈ నేపథ్యంలో తన తండ్రి హత్యకు న్యాయం జరగడం లేదంటూ సునీత తాజాగా మీడియా ముందుకు వచ్చారు. ఇవాళ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (ys avinash reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

వివేకా గుండెపోటుతో చనిపోయారని నాటకం సృష్టించిందే సునీతారెడ్డి, ఆమె భర్త నరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని అవినాష్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. వివేకా చనిపోయాక పోలీసులకు సమాచారం ఇచ్చింది తానే అన్నారు. ఈ కేసులో అనేక కీలకాంశాలను సునీత పక్కదారి పట్టించాం. వివేకాది మర్డర్ ఫర్ గెయిన్ అనే కోణంలో సునీత ఎందుకు కోరలేదని అవినాష్ ప్రశ్నించారు. ఈ కేసులో సీబీఐ ఏకపక్షంగా దర్యాప్తు చేసిందని, తనకు వ్యతిరేకంగా తప్పుడు సాక్ష్యాలు చెప్పాలని సునీత పలువురిని ఒత్తిడి చేశారు.

వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతపై కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు

చంద్రబాబుకు రాజకీయంగా అవసరం ఉన్నప్పుడు సునీత బయటికి వస్తారని, వచ్చే ఎన్నికల వరకూ ఈ కేసును సాగదీయలేనిది ఆమె ఆలోచన అని అవినాష్ రెడ్డి. ఈ కేసులో సునీత తప్పులు లేకపోతే దస్తగిరిని ఎందుకు కాపాడాలని ప్రశ్నించారు. ఆయన బెయిల్ రద్దు కాకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని అడిగారు. మూడేళ్లుగా ఈ కేసు విచారణ ముందుకెళ్లకుండా ఆమె అడ్డుకుంటున్నారని. పీఏ కృష్ణారెడ్డి ఇచ్చిన లేఖను సునీత పోలీసులకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. వివేకా రెండో భార్యకు ఆస్తులు రాసిస్తారనే చెక్ పవర్ తీసేశారని, అందుకే హత్య చేయించి ఉండొచ్చన్న కోణంలో దర్యాప్తు చేయడం లేదని సీబీఐని అవినాష్ ప్రశ్నించారు.

Source link