Monday, March 2, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణవిరుచుకుపడుతున్న తాలిబన్లు: పాకిస్తాన్ ఎఫ్ 16 కూల్చివేత- 19 ఆర్మీ పోస్టులపై కబ్జా | ఆఫ్ఘనిస్తాన్...

విరుచుకుపడుతున్న తాలిబన్లు: పాకిస్తాన్ ఎఫ్ 16 కూల్చివేత- 19 ఆర్మీ పోస్టులపై కబ్జా | ఆఫ్ఘనిస్తాన్ దళాలు పాకిస్తాన్ విమానాలు దాని గగనతలంలోకి ప్రవేశించిన తర్వాత కాల్చివేసాయి, భద్రతా ధృవీకరణ

📰 Generate e-Paper Clip


అంతర్జాతీయ

ఓయ్-చంద్రశేఖర్ రావు

పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధం తీవ్రతరమౌతోంది. అఫ్ఘానిస్తాన్‌లోని పలు నగరాలపై పాక్ వైమానిక దాడులు చేసింది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో పలు పేలుళ్లు సంభవించాయి. విమానాల శబ్దాలు వినిపించాయి. మిస్సైళ్ల మోతలతో ఉలిక్కిపడింది కాబుల్. మరో ప్రధాన నగరం కాందహార్‌తో పాటు పాకిస్థాన్‌తో సరిహద్దులను పంచుకుంటోన్న పక్‌టికాలోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. మెరుపుదాడులతో ఆప్ఘనిస్తాన్ నగరాలు అట్టుడికిపోయాయి.

దీన్ని సమర్థవంతంగా తిప్పికొడుతోంది ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం. సరిహద్దులపై విరుచుకుపడుతోంది. పాకిస్థాన్ సైన్యానికి చెందిన పలు క్యాంప్‌లను స్వాధీనం చేసుకుంది. తమ గగనతలంలోకి ప్రవేశించిన జెఎఫ్-17 పాకిస్తాన్ యుద్ధ విమానాన్ని ఆఫ్ఘన్ బలగాలు కూల్చివేశాయి. తూర్పు, ఆగ్నేయ సరిహద్దు ప్రాంతాలు పాకిస్తాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నాయి. నాలుగు గంటల ఆపరేషన్‌లో రెండు పాక్ సైనిక స్థావరాలు, 19 అవుట్‌పోస్టులు ధ్వంసం అయ్యాయి. కొన్నింటిని స్వాధీనం చేసుకున్నాయి.

ఆఫ్ఘనిస్తాన్ దళాలు పాకిస్తాన్ విమానాలను కాల్చివేసాయి, అది దాని గగనతలంలోకి ప్రవేశించిన తరువాత భద్రతా ధృవీకరణ

మరో నాలుగు పోస్టుల నుండి పాకిస్తాన్ సైనికులు పారిపోయినట్లు టోలో న్యూస్ ప్రసారం. అనేక ఆయుధాలు, ఓ వార్ ట్యాంక్, సైనిక రవాణా వాహనాన్ని కూడా ఆప్ఘనిస్తాన్ బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు గుర్తించారు. పాకిస్తాన్ నిర్వహించిన వైమానిక దాడుల్లో మరణించారని, దీనికి ప్రతీకారంగా తాము ఎదురుదాడికి దిగినట్లు ఆఫ్ఘన్ ఆర్మీ. ఈ దాడుల్లో ఎనిమిది మంది సైనికులు వీరమరణం పొందినట్లు తెలుస్తోంది. 11 మంది గాయపడ్డారు.

పాకిస్తాన్ సైనిక చర్యలో ఎనిమిది మంది ముజాహిదీన్లు ప్రాణత్యాగం చేసినట్లు, మరో 11 మంది గాయపడ్డారని ఆఫ్ఘన్ రక్షణ మంత్రిత్వ శాఖ. పాక్ అవుట్‌పోస్టులను స్వాధీనం చేసుకున్న వీడియోలు ఆఫ్ఘన్ మీడియా విడుదల చేసింది. అలాగే- నంగర్‌హార్‌లోని శరణార్థి శిబిరంపై పాకిస్తాన్ జరిపిన క్షిపణి దాడిలో 13 మంది పౌరులు గాయపడినట్లు వార్తలు వెలువడుతున్నాయి. 2,611 బ్రిటిష్ డ్యూరాండ్ లైన్ ఆఫ్ఘనిస్తాన్ గుర్తించబడింది ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు.

పాక్ సైనిక చర్యను దుస్సాహసంగా ఆఫ్ఘన్ మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. మహిళలు, పిల్లలు హతమైనట్లు ఆరోపించింది. చాలా మంది పాక్ సైనికుల మృతదేహాలు తమ వద్ద ఉన్నాయని, కొందరిని సజీవంగా పట్టుకున్నామని ఆఫ్ఘన్ బలగాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో, పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఆఫ్ఘనిస్తాన్‌తో బహిరంగ యుద్ధాన్ని ప్రకటించారు. తమ సహనం నశించిందని, ఇప్పుడు బహిరంగ యుద్ధమేనని తేల్చి చెప్పారు.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular