వ్యాపారం
ఓయ్-చంద్రశేఖర్ రావు
దేశీయ టెక్ దిగ్గజం.. విప్రో బంపర్ ఆఫర్ ఇచ్చింది. తమ ఉద్యోగుల జీతాల పెంపుదలను మార్చి 1 నుండి అమలు చేయనుంది. సెప్టెంబర్ 2024లో చివరిసారిగా ఇంక్రిమెంట్లు ఇచ్చిన తర్వాత మళ్లీ అప్రైజల్స్ ప్రకటించడం ఇదే తొలిసారి. దాదాపుగా ఏడాదికి పైగా వాయిదా పడుతూ వచ్చిన ఈ నిర్ణయం ఇప్పుడు అమలులోకి వస్తోంది. పెరిగిన జీతాల శాతం ఎంత అంటే దానిపై విప్రో యాజమాన్యం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.
ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో మందగమనం, భౌగోళిక రాజకీయ అనిశ్చితి, క్లయింట్లు టెక్నికల్ బడ్జెట్ను కుదించడం వంటి కారణాలతో గతంలో బేస్ పే సవరణలను నిలిపివేసింది. వేతన పెంపుదల విషయంలో యాజమాన్యం ఇంకా తర్జనభర్జన పడుతోందని, దావోస్లోని ప్రపంచ ఆర్థిక ఫోరం సమావేశం తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఈ ఏడాది ప్రారంభంలో విప్రో చీఫ్ హెచ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్. అప్రైజల్స్ ఉంటాయని, ఎప్పుడనే విషయంపై ఇంకా తుది నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉందని అన్నారు.

దీనికి వాస్తవ రూపాన్ని ఇచ్చింది విప్రో మేనేజ్మెంట్. మార్చి 1 నుండి జీతాలు పెంచడానికి ప్రదర్శన. ఈ వేతన పెంపుదల ఇతర పోటీ కంపెనీల విధానాలతో భిన్నంగా ఉంటోంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తన వేతన పెంపుదల సైకిల్ ను ఏప్రిల్ నుండి సెప్టెంబర్కు వాయిదా వేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ రెండు నుండి ఎనిమిది వాతం వరకు పెంపుదలను అమలు చేసింది. ఇన్ఫోసిస్ దశలవారీగా ఇంక్రిమెంట్లను విడుదల చేసింది. అయిదు శాతం పెరుగుదల లభించింది.
కాగ్నిజెంట్ కూడా మొదట జీతాల పెంపుదలను వాయిదా వేసింది గానీ.. సంవత్సరంలోపే వాటిని తిరిగి ప్రారంభించారు. ఇక తాజాగా విప్రో కూడా అదే బాట పట్టింది. డిసెంబర్ త్రైమాసికంలో విప్రో ఆదాయం 5.5 శాతం పెరిగి 23,555 కోట్ల రూపాయలకు చేరుకుంది. నికర లాభాలు ఏడు శాతం తగ్గాయి. 3,145 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి.
బేస్ రీ పెంపుదల వాయిదా పడశాల, విప్రో వే పరిహారాన్ని చెల్లించడం కొనసాగించింది. 31 ముగిసిన త్రైమాసికానికి సంబంధించి డిసెంబర్ శాతం త్రైమాసిక వేరియబుల్ పే అవుట్ను ఫిబ్రవరి జీతాలతో కలిపి పంపిణీ చేయ కంపెనీ కంపెనీ ప్రకటించింది. అంతకు ముందు రెండు త్రైమాసిక 90 సంవత్సరాలకు పైగా చెల్లింపులు జరిగాయి. మార్కెట్ పరిస్థితులు మెరుగుపడే వరకు ఎంట్రీ లెవెల్స్, ఫ్రెషర్స్ కు పరిమితంగా ఉండొచ్చు.

