seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 04 February 2026, 4:15 pm Digital Edition : SEEMA KIRANAM

విద్యుత్ వినియోగదారులకు తీపి కబురు!

విద్యుత్ వినియోగదారులకు తీపి కబురు!

 

దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక ఊరటనిచ్చింది. ‘విద్యుత్ సవరణ నిబంధనలు-2024’ ప్రకారం.. ఇకపై ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే మెట్రో నగరాల్లో 3 రోజులు, మున్సిపాలిటీల్లో 7 రోజులు, పల్లెల్లో 15 రోజుల్లోగా కొత్త కనెక్షన్ ఇవ్వడం తప్పనిసరి. కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పారదర్శకతను పెంచారు. జాప్యం జరిగితే ఆటోమేటిక్ గా ఉన్నతాధికారులకు సమాచారం వెళ్లేలా వ్యవస్థను రూపొందించారు. రేపటి నుంచే ఈ నిబంధనలు అమలు కానున్నాయి.