seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 02 March 2026, 7:27 am Digital Edition : SEEMA KIRANAM

వారి రేషన్ కార్డులు రద్దు, జాబితా సిద్దం – అనూహ్య నిర్ణయం..!! | తెలంగాణ ప్రభుత్వం రేషన్ సరఫరాలో సంస్కరణల అమలుకు కసరత్తు ప్రారంభించింది, నివేదిక కోరింది

తెలంగాణ

ఓయ్-సాయి చైతన్య

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

రేషన్ సరఫరాలో కీలక మార్పుల దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అర్హులందరికీ రేషన్ అందే విధంగా సంస్కరణలు ప్రారంభమయ్యాయి. అదే విధంగా రేషన్ కార్డుల రద్దు పైన పౌర సరఫరాల శాఖ అధికారులు నివేదిక సిద్దం చేస్తున్నారు. తాజాగా అందిన మేరకు మండల స్థాయి నుంచి ప్రభుత్వానికి నివేదికలు అందుతున్నాయి. కాగా, కొత్త రేషన్ కార్డు పొందిన విషయం లో లబ్దిదారులకు ఇచ్చిన జిల్లాల వారిగా లెక్కలు తీస్తున్నారు. దీంతో, తాజా ప్రతిపాదనల మేరకు పెద్ద సంఖ్యలో రేషన్ కార్డులకు కోత పడే అవకాశం అందుబాటులోకి వచ్చింది.

తెలంగాణలో రేషన్ సరఫరాలో ప్రభుత్వం కీలక మార్పులకు సమాయత్తం అవుతోంది. ప్రతీ నెలా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యం కొందరు లబ్దిదారులు తీసుకోవటం లేదనే అంశం ప్రభుత్వానికి నివేదికలు అందాయి. దీనితో…అనర్హులను గుర్తించే అంశం పైన ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పూర్తి లెక్కలు చేపట్టే పని ప్రారంభమైంది. రేషన్‌గా లబ్ధిదారుల్లో వరుసగా గత ఆరు నెలలు ఎవరెవరు బియ్యం తీసుకుంటున్నారో లేదో, ఆ వివరాలను పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ కార్యాలయం నుంచి మండల తహసీల్దార్‌ ఆఫీస్‌ లాగిన్‌కు సిబ్బంది పంపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెద్ద సంఖ్యలో కొత్త కార్డులను అందించింది. వీరిలో చాలామంది సన్న బియ్యం తీసుకోవటం లేదని పేర్కొన్నారు. దీంతో, అసలు కారణాలేమిటో గుర్తించాలని అధికారులను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

రేషన్ సరఫరాలో సంస్కరణల అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.

క్షేత్ర స్థాయి నివేదికల ప్రకారం నిర్ణయం

కొన్ని విభాగాల్లో ప్రభుత్వం ఇస్తున్న రేషన్ బియ్యం తీసుకుని వాటిని 10 నుంచి 20 రూపాయల వరకు అమ్ముకుంటున్న అంశం పైన క్షేత్ర స్థాయి నుంచి అధికారులు అందించారు. దీని కారణంగా ప్రభుత్వం బియ్యం పక్క దారి పడుతోంది. ప్రభుత్వం అందించే బియ్యం పోషకాలతో ఉన్నా.. మార్కెట్‌లో దొరికే సాధారణ వైపే మొగ్గు చూపుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో.. ప్రభుత్వం ఆరు నెలల పాటు బియ్యం తీసుకోని వారి జాబితాలను సిద్దం చేయాలని పౌర శాఖకు సూచించింది. ఈ మేరకు క్షేత్ర స్థాయి నుంచి అధికారులు నివేదికలను సిద్దం చేస్తున్నారు. దీని ద్వారా ఆరు నెలల రేషన్ తీసుకోని వారి కార్డులను రద్దు చేయాలనే ఆలోచనలో కనిపిస్తోంది. దీని పైన పూర్తి నివేదికలు అందిన తరువాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఆంగ్ల సారాంశం

ఈ నెల 10లోపు అన్ని జిల్లాల లబ్ధిదారులకు రేషన్ పంపిణీపై తెలంగాణ ప్రభుత్వం విత్తన నివేదికలు

Source link