seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 07 March 2026, 2:16 pm Digital Edition : SEEMA KIRANAM

వరంగల్ కు వరమిచ్చిన తెలంగాణ ప్రభుత్వం.. ఆ భారీ ప్రాజెక్టుకు రూ.5257 కోట్లు! | తెలంగాణ ప్రభుత్వం శుభవార్త: భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ కోసం gwmc కు 5257 కోట్లు మంజూరు

తెలంగాణ

oi-డాక్టర్ వీణా శ్రీనివాస్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కు భారీ శుభవార్త చెప్పింది. హైదరాబాద్ తర్వాత వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కు 5257 కోట్ల రూపాయలను అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు తాజాగా గ్రేటర్ వరంగల్ భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం కోసం చేసింది.

వరంగల్ ప్రజల చిరకాల డిమాండ్ ని తీరుస్తూ ప్రభుత్వ నిర్ణయం

రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన వరంగల్ కు ఇది అత్యంత అని భావించిన gwmc ప్రజల చిరకాల డిమాండ్ తీరుస్తూ నగర రూపరేఖలను మార్చనుంది. వరంగల్ నగరంలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేక మురుగు కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక వర్షాకాలం వచ్చిందంటే, ఒక్క వర్షం పడినా చాలు అనేక కాలనీలు ముంపుకు గురవుతున్నాయి.

భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ కోసం gwmcకి 5257 కోట్లు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

తెలంగాణ ప్రభుత్వం 5257 కోట్ల రూపాయలతో

భూగర్భ కాలువలు సరిగా లేకపోవడం, వర్షపు నీటి నిర్వహణ లేకపోవడం వంటి అనేక కారణాలు నగరం ముంపుకు కారణమవుతున్నాయి. ఇక ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడానికి సంకల్పించిన తెలంగాణ ప్రభుత్వం 5257 కోట్ల రూపాయలను అందించింది.

మూడు దశలలో నిర్మాణ పనులు అమలు

ఈ ప్రాజెక్టుకు జర్మనీ kfw బ్యాంక్ 50% రుణాన్ని అందిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరొక 25% నిధులు భరిస్తాయి. మొత్తం 5257 కోట్లతో భూగర్భ డ్రైనేజీ నిర్మాణం ఇప్పటికే dpr సిద్ధం కాగా, దీని మూడు దశల్లో అమలు చేయబడింది. భూగర్భ కాలువలు, వర్షపు నీటి నిర్వహణ, వీటి సరఫరా, జలవనరుల పునర్జీవం అంటే నీటి దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్టు చేయనున్నారు.

నిధులతో డిపిఆర్ ఆధారంగా పనులు

ఈ ప్రాజెక్టులో భాగంగా విద్యుత్, టెలికాం, కేబుల్, ఇంటర్నెట్ వంటి అన్ని సేవలకు భూగర్భ సొరంగాలు నిర్మిస్తారు. నిధులతో డిపిఆర్ ఆధారంగా పనులను వేగవంతం చేయనున్నారు. ఈ ప్రాజెక్టుతో వరంగల్ త్వరలోనే కొత్త రూపు సంతరించుకుంటోందని అధికారులు. తెలంగాణా ప్రభుత్వం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం నిధులు ఇవ్వడం కోసం వరంగల్ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఆంగ్ల సారాంశం

తెలంగాణ ప్రభుత్వం వరంగల్‌కు శుభవార్త చెప్పింది. గ్రేటర్ వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణానికి ఇటీవల గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కు రూ.5257 కోట్లు మంజూరు చేసింది.

Source link