Wednesday, March 18, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణవచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు.. ఆంధ్రప్రదేశ్ లక్ష్యమన్న మంత్రి! | వచ్చే ఐదేళ్లలో 2...

వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు.. ఆంధ్రప్రదేశ్ లక్ష్యమన్న మంత్రి! | వచ్చే ఐదేళ్లలో 2 మిలియన్ల ఉద్యోగాలు కల్పించడమే ఏపీ ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

📰 Generate e-Paper Clip


ఆంధ్ర ప్రదేశ్

oi-డాక్టర్ వీణా శ్రీనివాస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం అన్ని రంగాలలో ఏపీని ప్రోగ్రాం దిశగా అడుగులు వేయించింది. పారిశ్రామికంగా ఏపీ ప్రగతి సాధిస్తే, ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందని ఏపీ ప్రభుత్వం అనేక కంపెనీలను ఏపీకి స్వాగతిస్తోంది. ముఖ్యంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పన లక్ష్యంగా పనిచేస్తున్న ఏపీ సర్కార్ రాష్ట్రంలో ఉద్యోగాలు లేని యువత ఉండకుండా తనవంతు ప్రయత్నం చేస్తుంది.

20 లక్షల ఉద్యోగాలు కల్పన లక్ష్యం పెట్టుకోవాలన్న మంత్రి

ఈ ఉద్దేశ్యంతో వచ్చే ఐదు సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగాలు కల్పన లక్ష్యంగా పెట్టుకొని పనిచేయాలని సూక్ష్మ చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు ఏపీ సెర్ప్ మరియు ఎన్ఆర్ఐ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. నేడు మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి మండలి (APEDB) నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ల మంత్రి నారా లోకేష్‌తో కలిసి ఆయన గడిపారు.

వచ్చే ఐదేళ్లలో 2 మిలియన్ల ఉద్యోగాలు కల్పించడమే ఏపీ ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్

అంతర్జాతీయ పెట్టుబడులకు చిరునామాగా ఏపీ

ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించిన 20లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యం చేరుకోవడంలో ఏపీఈడీబీ పాత్ర కీలకమని ఆయన స్పష్టం చేశారు. ఈ పెద్ద లక్ష్యం విజయవంతంగా పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆయన గుర్తు చేశారు. మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయ పెట్టుబడులకు అత్యుత్తమ చిరునామాగా మార్చే ప్రక్రియలో భాగస్వామ్యం కావడం గర్వకారణంగా ఉందని మంత్రి పేర్కొన్నారు.

రాబోయే ఐదేళ్లలో ఉద్యోగాల కల్పన లక్ష్యాన్ని చేరుకోవాలి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల కల్పనకు అపారమైన అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకు మనం ఇచ్చిన హామీ మేరకు రాబోయే ఐదేళ్లలో లక్ష్యాన్ని చేరుకోవడమే కాకుండా, ఆ తర్వాత కాలంలో అంతకు మించిన విజయాలను నమోదు చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆకాంక్షించారు. ఈ లక్ష్య సాధన కోసం జిల్లా కలెక్టర్లతో పాటు అన్ని శాఖలను సమన్వయం చేసుకోవాలన్నారు.

ప్ర‌పంచ వ్యాప్తంగా ఆంధ్రాలో పెట్ట‌బ‌డులు పెట్టేందుకు ఆస‌క్తి

కింది స్థాయిలో MSME గురించి అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని, విభాగ క‌లెక్ట‌ర్ల‌తో పాటు అన్ని శాఖ‌ల స‌హ‌కారం తీసుకుని సూక్ష్మ చిన్న మరియు మ‌ధ్య తరహా పరిశ్రమలు ప‌టిష్టం కావాల‌న్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పెట్టుబ‌డుల‌కు కావాల్సిన సంపూర్ణ స‌హ‌కారం అందిస్తోందని ఆయన తెలిపారు. ఇది గుర్తించే ప్ర‌పంచ వ్యాప్తంగా ఆంధ్రాలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఎంతోమంది ఆస‌క్తి చూపిస్తున్నారు. ఇది మ‌న‌మంద‌రం గ‌ర్వించాల్సిన విష‌యం అని మంత్రి కొండ‌పల్లి శ్రీనివాస్‌ అన్నారు. ఈ విష‌యంలో క‌ష్ట‌ప‌డుతున్న సంబంధిత శాఖాధికారుల‌ను కూడా మంత్రి అభినందించారు.



Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular