భారతదేశం
-లింగారెడ్డి గజ్జల
భారతీయ రైల్వే తన డిజిటల్ సేవలో మరో విప్లవాత్మక మార్పుకు శ్రీకారం చుట్టింది. ప్రయాణికుల టిక్కెట్ల కోసం కౌంటర్ల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా, అన్ని రకాల సేవలను ఒకే చోటికి చేరుస్తూ ‘రైల్వన్’ (RailOne) యాప్ను అందుబాటులోకి తెచ్చింది. రిజర్వ్డ్ (PRS), అన్-రిజర్వ్డ్ (UTS) టిక్కెట్లతో పాటు ప్లాట్ఫాం టిక్కెట్లు, పిఎన్ఆర్ (PNR) విచారణ, రైల్మదద్ వంటి సేవలన్నీ ఇప్పుడు ప్రయాణికుల అరచేతిలోకి వచ్చాయి. ఈ వివరాలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల లోక్సభలో ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం భారతీయ రైల్వేలో సుమారు 88 శాతం రిజర్వ్డ్ టిక్కెట్లు ఆన్లైన్ ద్వారా బుక్ అవుతున్నాయి. ఈ కోసం ‘రైల్వన్’ యాప్ అనూహ్య ఆదరణ పొందుతోంది. 2026 మార్చి 15 నాటికి, ఈ యాప్ దాదాపు 2.57 కోట్ల డౌన్లోడ్లను నమోదు చేసుకుంది. నిత్యం సగటున 7.64 లక్షల టిక్కెట్లు ఈ యాప్ బుక్ ద్వారా అవుతుండటం విశేషం. అధునాతన భద్రతా ప్రమాణాలు, గోప్యతతో కూడిన ఈ యాప్ ఆండ్రాయిడ్ మరియు ఆపిల్ స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. ఒకే లాగిన్తో రైల్వేకి సంబంధించిన అన్ని పనులను పూర్తి చేసుకోవచ్చు.

యువతకు ఉపాధి. ఏజెంట్ల నియామకం!
రైల్వే సేవలను మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరించడంలో రైల్వే శాఖ పలు రకాల ఏజెంట్లను నియమిస్తోంది. అన్-రిజర్వ్డ్ల కోసం హాల్ట్ ఏజెంట్లు, జన్ సాధారణ టికెట్ బుకింగ్ సేవక్ (JTBS), స్టేషన్ టికెట్ బుకింగ్ ఏజెంట్లు (STBA) వంటి విభాగాల్లో నిరుద్యోగ యువతకు అవకాశం కల్పిస్తోంది. వీరికి ముందస్తు అనుభవం లేకపోయినా దరఖాస్తు చేసుకోవచ్చు. దీనివల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల యువతకు స్వయం ఉపాధి లభించడమే కాకుండా, ప్రయాణికులకు టిక్కెట్ల లభ్యత సులభతరం అవుతుంది.
అనుభవం ఉన్న వారికే ‘YTSKL’ లైసెన్స్లు!
రిజర్వ్డ్ మరియు అన్-రిజర్వ్డ్ టిక్కెట్లు జారీ చేసే యాత్రి టిక్కెట్ సువిధా కేంద్ర లైసెన్సీల (YTSKL) విషయంలో మాత్రం ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. ఈ లైసెన్స్ పొందాలంటే వారికి కనీసం రెండేళ్ల రైల్వే టికెటింగ్ అనుభవం తప్పనిసరి. ఏజెంట్ల నియామకాల నిబంధనల ప్రకారం నిర్ణీత కాలానికి జరుగుతుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే వారి అనుమతిని రద్దు చేయాలని మంత్రి తెలిపారు. పాత ఏజెంట్ల పదవీకాలం ముగిశాక కొత్త దరఖాస్తులను ఆహ్వానించడం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.

