seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 07 March 2026, 9:08 am Digital Edition : SEEMA KIRANAM

రైతులకు షాక్: భారీగా పెరిగిన ఎరువుల ధరలు.. | గ్లోబల్ ఫార్మింగ్ అలర్ట్: మిడిల్ ఈస్ట్ వివాదం గ్యాస్ సరఫరాకు అంతరాయం కలిగించడంతో నత్రజని ఎరువుల ధరలు రెట్టింపు కావచ్చు.

భారతదేశం

-లింగారెడ్డి గజ్జల

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

మధ్యప్రాచ్యంలో ముసిరిన యుద్ధ మేఘాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతన్నల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య మొదలైన ఈ పోరు కేవలం ఆయుధాలకే పరిమితం కాకుండా, పొలాల్లో పండాల్సిన పంటలపై తన ప్రతాపాన్ని చూపుతోంది. ముఖ్యంగా రసాయన మందుల ధరలు ఆకాశన్నంటుతుండటంతో సాగు భారమై రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. అమెరికాలోని సౌత్ డకోటా నుంచి ఆస్ట్రేలియా పొలాల వరకు ఇదే ఆందోళన మొదలైంది.

ప్రస్తుత ఉద్రిక్తతల వల్ల ఉత్పత్తికి అత్యంత కీలకమైన సహజ వాయువు (నేచురల్ గ్యాస్) సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. యూరియా, అమోనియం, ఇతర NPK ఎరువుల తయారీలో గ్యాస్ ప్రధాన ముడి పదార్థం కావడంతో, ఉత్పత్తి పడిపోయింది. దీని ప్రభావం ధరలపై స్పష్టంగా కనిపించింది. కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే టన్ను యూరియా ధర 470 డాలర్ల నుంచి ఏకంగా 550 డాలర్ల మార్కును దాటేసింది. సాధారణంగా ఒక రైతు సాగు ఖర్చులో పంట వాటా 50 శాతం వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ ధరల పెరుగుదల నేరుగా రైతుల ఆర్థిక వెన్నుముకను విరజిమ్ముతోంది.

గ్లోబల్ ఫార్మింగ్ హెచ్చరిక మిడిల్ ఈస్ట్ వివాదం గ్యాస్ సరఫరాకు అంతరాయం కలిగించడంతో నత్రజని ఎరువుల ధరలు రెట్టింపు కావచ్చు

హార్ముజ్ సెగ.. రెట్టింపు కానున్న ధరలు?

ప్రపంచ ఉత్పత్తుల సరఫరాలో మూడో వంతు వాటా కలిగిన ‘హార్ముజ్ జలసంధి’ని మూసివేస్తామని ఇరాన్ ఈ సంక్షోభాన్ని మరింత జటిలం చేస్తోంది. విశ్లేషకుల అంచనా ప్రకారం, ఈ సరఫరా గొలుసులో అంతరాయాలు ఇలాగే కొనసాగితే.. మున్ముందు నత్రజని (నైట్రోజన్) మందుల ధరలు రెట్టింపు అయ్యే ప్రమాదం ఉంది. అలాగే ఫాస్ఫేట్ ఉత్పత్తుల ధరలు కూడా 50 శాతం మేర పెరగవచ్చు. పశ్చిమాసియా వివాదం వల్ల చమురు ధరలు కూడా పెరుగుతాయి, రవాణా ఖర్చులు పెరిగి వ్యవసాయం అతలాకుతలమవుతోంది.

దిగుబడులపై యుద్ధ ప్రభావం

మందుల కొరత ఏర్పడితే అది నేరుగా దిగుబడిపై పడుతుంది. దిగుబడులు తగ్గితే మార్కెట్‌లో ధాన్యం, బియ్యం వంటి ఆహార పదార్థాల లభ్యత తగ్గిపోయి కృత్రిమ కొరత ఏర్పడుతుంది. “పొలంలో పంట పండి మన పళ్లెంలోకి రావడానికి 6 నుండి 9 నెలల సమయం పట్టవచ్చు కానీ, వచ్చే క్రిస్మస్ నాటికి ఆహార ద్రవ్యోల్బణం ఆకాశన్నంటుందని” నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో పదివేల ఎకరాల్లో మొక్కజొన్న పండించే రైతుల నుంచి, ఆగ్నేయాసియాలోని చిన్న పామాయిల్ రైతుల వరకు అందరూ ఇప్పుడు మందుల కోసం అల్లాడుతున్నారు.

చిన్న రైతులకు గండం.. ఆహార భద్రతకు ముప్పు!

పెద్ద రైతులు ఎలాగోలా సర్దుబాటు చేసుకుంటున్నారు, అభివృద్ధి చెందుతున్న దేశంలోని చిన్న రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. మందులు కొనలేక చాలామంది సాగునే వదిలేసే ప్రమాదం ఉంది. పోలాండ్ వంటి దేశాల్లోనైతే రసాయన మందులు దొరకక, రైతులు పశువుల పేడ కోసం ఇరుగుపొరుగు వారిని ఆశ్రయిస్తున్నారు. కోవిడ్ మహమ్మారి, ఉక్రెయిన్ యుద్ధం సృష్టించిన గాయాల నుంచి ప్రపంచం కోలుకుంటున్న తరుణంలో.. ఈ మధ్యప్రాచ్య పోరు గ్లోబల్ సౌత్ దేశాల్లో తీవ్రమైన మానవతా సంక్షోభాన్ని, ఆహార కొరతను సృష్టిస్తోంది.

ఆంగ్ల సారాంశం

మిడిల్ ఈస్ట్ వివాదం యూరియా ధరలను రోజుల వ్యవధిలోనే $470 నుండి $550కి పెంచింది. సహజవాయువు సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో, అమ్మోనియం మరియు ఎన్‌పికె వంటి అవసరమైన ఎరువులు ఉత్పత్తి కోతలను ఎదుర్కొంటున్నాయి. ఈ సంక్షోభం నత్రజని ఎరువుల ఖర్చులను రెట్టింపు చేసి ప్రపంచ ఆహార భద్రత మరియు వ్యవసాయ ఖర్చులను ఎలా ప్రభావితం చేస్తుందో కనుగొనండి.

Source link