తెలంగాణ
ఓయ్-సాయి చైతన్య
<!--
--> <!-- -->ముఖ్యమంత్రి రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం 2028 చివర్లో జరగాల్సి ఉంది. అయితే, షెడ్యూల్ మారుతుందని. అదే విధంగా జిల్లాల రద్దు, కొత్త జిల్లాల ఏర్పాటు ఆలోచన లేదని తేల్చి చెప్పారు. జిల్లాల ఏర్పాటు పైన చర్చ జరుగుతున్న వేళ రేవంత్ వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారాయి. జైలుకు బీఆర్ఎస్ నేతలు పోటీ పడటానికి… చట్ట ప్రకారమే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన పైనా తన అభిప్రాయం చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేసారు. రాసి పెట్టుకోండి.. తెలంగాణ అసెంబ్లీకి నిర్దిష్ట కాలపరిమితి ప్రకారం 2028 డిసెంబరులో ఎన్నికలు రావాలి.. కానీ అప్పుడు కాకుండా 2029లో శాసనసభకు ఎన్నికలు జరుగుతాయి…’ అని తేల్చి చెప్పారు. పార్లమెంటుకు, దేశంలోని వివిధ రాష్ట్రాలకు కలిపి ఒకేసారి (జమిలీ) ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని మోడీ అసెంబ్లీని ఏర్పాటు చేయడం దీనికి కారణమని వివరించారు. ఆ ప్రకారంగా 2029 లో పార్లమెంటు ఎన్నికలతో కలిపి తెలంగాణకు ఎలక్షన్లను నిర్వహించారని వివరించారు. 2029 నాటికి జనగణనలో కులగణన, మహిళా పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన, వాటి సంఖ్య పెంపు, రిజర్వేషన్ల అమలు అనేవి బీజేపీ వ్యూహాలుగా ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. అయితే జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లను పెంచుతామనటం సరికాదన్నారు. దీనివల్ల కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేసి, క్రమశిక్షణను నిరూపించుకున్న దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

జమిలి దిశగా కేంద్రం కసరత్తు
కాగా, యూపీ, బీహార్లాంటి ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు పెరుగుతాయి.. కేరళ, తమిళనాడు, కర్నాటక, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో సీట్లు తగ్గాయి. అందువల్ల సంఖ్యను పెంచి తే.. ఇప్పుడున్న ప్రకారం రాష్ట్రంలో సీట్ల మధ్యనున్న గ్యాప్ను కొనసాగించాలని, అందుకనుగుణంగా సర్దుబాట్లు వాటిని చేయాలని సూచించింది. అలా చేయకపోతే పార్లమెంటులో బలం కోసం దక్షిణాది రాష్ట్రాలపై ఆధార పడాల్సిన అవసరమే కేంద్రానికి ఉండబోదని హెచ్చరిం చారు. ఇదే జరిగితే నిధులు, గ్రాంట్లు, సహాయాల విషయం లో ఆయా రాష్ట్రాలను కేంద్రం పట్టించుకోబోదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆర్థికపరమైన అంశాల్లో దక్షిణాది పట్ల మోడీ సర్కార్ తీవ్ర వివక్షను చూపుతోందని. అయితే కేంద్రం నిధులు ఇచ్చినా, తెలంగాణలో మాత్రం అభివృద్ధి ఆగదని స్పష్టం చేశారు. జైలు కు పోతే సీఎం అవుతామనే ఒక భావన సర్వత్రా వ్యాపించి ఉంది. జైలుకు పోయిన జగన్, చంద్రబాబుతోపాటు తాను కూడా సీఎం అయ్యామని.. అందుకే ఇప్పుడు వాళ్లు (కేటీఆర్, హరీశ్రావు) కూడా జైలుకు వెళ్లేందుకు తహతహ లాడేందుకు రేవంత్ ఎద్దేవా చేశారు. 2026 జనవరి ఒకటి నుంచి 2027 మార్చి 31 వరకు దేశంలోని ఏ హద్దులూ (రాష్ట్రాలు, జిల్లాలు, మండలాలు వగైరా) మార్చటానికి వీల్లేదంటూ కేంద్రం ఆదేశాలు జారీ చేసిందని రేవంత్రెడ్డి వివరించారు. అందుకే ఇప్పటికిప్పుడు జిల్లా పునర్విభజన ప్రసక్తే ఉండబోదని స్పష్టం చేశారు.
-
కేసీఆర్ కు కానుకగా ఇస్తాను, హరీష్ కీలక వ్యాఖ్యలు…!!
<!--
--> -
నెక్స్ట్ జరిగేది ఇదే, కేటీఆర్ సంచలనం..!!
<!--
--> -
మేం ఆ పని చేస్తున్నాం.. మున్సిపల్ ఎన్నికలలో హీటెక్కిస్తున్న ప్రతిజ్ఞలు!
<!--
--> -
అక్కడ మద్యం షాపులు బంద్.. బల్క్ మెసేజ్ లు, గుంపులుగా ఉండటం నిషేధం!
<!--
--> -
మందు బాబులకు బ్యాడ్ న్యూస్- వైన్స్, బార్లు బంద్, ఎప్పటి వరకు..!!
<!--
--> -
వారిని ఎక్కడ దాచుకున్నా వదిలిపెట్టం – కేటీఆర్ హెచ్చరిక..!!
<!--
--> -
స్కూళ్లకు ఈ వారంలో వరుసగా నాలుగు రోజులు సెలవులు, తాజా ఉత్తర్వులు..!!
<!--
--> -
అక్కడ ఫ్రిజ్ లు, కొత్త టీవీలు, వాషింగ్ మెషీన్లు.. నక్కతోక తొక్కిన ఓటర్లు!
<!--
--> -
రేపే రైతు భరోసా, పోలింగ్ కు ముందే నిధుల జమ – ఒక్కొక్కరి ఖాతాలో రూ 6 వేలు..!?
<!--
--> -
హైదరాబాద్ నుంచి విశాఖ వైపు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్..ఇక నుంచి..!!
<!--
--> -
T20 World Cup: అభిషేక్కు అనారోగ్యం.. ఆ స్టార్ ఆల్రౌండర్కు పిలుపు..!!
<!--
--> -
ఎట్టకేలకు రైతు భరోసా నిధులకు లైన్ క్లియర్, ఆ రోజునే జమ..!!
<!--
--> -
ఎన్టీఆర్, సుకుమార్ కాంబోలో భారీ సినిమా..! రాండ్ రాక్ స్టోరీతో..
<!--
--> -
తెలంగాణలోని ఆ రైల్వే స్టేషన్ రూపు రేఖలు మారిపోతున్నాయి
<!--
--> -
స్థలం ఉన్నా, లేకున్నా మీకు సొంతిల్లు గ్యారెంటీ!
<!--
-->
ఆంగ్ల సారాంశం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు, 2029లో ఎన్నికలు ఒకే దేశం ఒకే ఎన్నికలు అని అన్నారు.