తెలంగాణ
ఓయి-లింగారెడ్డి గజ్జల
<!--
--> <!-- -->తెలంగాణ రాష్ట్రంలో రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని వ్యాపారులు, వినియోగదారుల సౌకర్యార్థం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 19 నుండి మార్చి 20, 2026 వరకు రాష్ట్రంలోని షాపులు మరియు వ్యాపార సంస్థలకు (షాప్లు మరియు ఎస్టాబ్లిష్మెంట్స్) పని వేళల్లో ప్రత్యేక మినహాయింపులు ఇస్తూ లేబర్ కమిషనర్ దాన కిషోర్ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి.
రంజాన్ సమయంలో రాత్రిపూట పెరిగే వ్యాపార రద్దీని దృష్టిలో ఉంచుకుని, ప్రతిరోజూ తెల్లవారుజామున 5 గంటల వరకు షాపులను తెరిచి ఉంచుకునేందుకు అధికారికంగా అనుమతి లభించింది. తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టంలోని నిర్దేశిత నిబంధనల నుంచి ఈ పవిత్ర మాసం ముగిసే వరకు ఈ మినహాయింపులు వర్తిస్తాయి.

రంజాన్ రెట్టింపు వేతనం..
ఈ పెంచిన పని వేళల నేపథ్యంలో పనిచేసే ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రభుత్వం పటిష్టమైన నిబంధనలు విధించింది. సాధారణ పని గంటల కంటే అదనంగా (ఓవర్టైమ్) పనిచేసే సిబ్బందికి యాజమాన్యాలు తప్పనిసరిగా రెట్టింపు వేతనం చెల్లించాల్సి ఉంటుంది.
అలాగే, సెలవు రోజుల్లో విధులు నిర్వహించే ఉద్యోగులకు మరో రోజున ప్రత్యామ్నాయ సెలవును కల్పించడం తప్పనిసరి. అయితే, ఏ రోజున అయినా సరే ఒక ఉద్యోగి పనిచేసే మొత్తం సమయం 13 గంటల పరిమితిని మించకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
రాత్రి 8:30 గంటల తర్వాత..
మహిళా ఉద్యోగుల భద్రత మరియు ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టింది. రంజాన్ సందర్భంగా పెంచిన అదనపు గంటల నుంచి మహిళా సిబ్బందికి పూర్తి మినహాయింపు ఇచ్చారు. రాత్రి 8:30 గంటల తర్వాత మహిళా ఉద్యోగుల చేత పనులు చేయించకూడదని యాజమాన్యాలకు కఠిన ఆదేశాలు జారీ అయ్యాయి. పండగ సీజన్లో వ్యాపారాలు సజావుగా సాగడంతో పాటు, కార్మికుల ప్రయోజనాలకు భంగం కలగకుండా ఈ నియమ నిబంధనలను రూపొందించారు.
ఆంగ్ల సారాంశం
తెలంగాణ లేబర్ కమీషనర్ రంజాన్/రంజాన్ 2026 కోసం ఆర్డర్లను జారీ చేసారు. ఫిబ్రవరి 19 నుండి మార్చి 20 వరకు ప్రతిరోజూ ఉదయం 5 గంటల వరకు దుకాణాలు మరియు సంస్థలు తెరిచి ఉంటాయి. ఉద్యోగి ఓవర్టైమ్ వేతనాలు మరియు మహిళా సిబ్బందికి భద్రతా మార్గదర్శకాల గురించి తెలుసుకోండి.