seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 22 March 2026, 2:51 am Digital Edition : SEEMA KIRANAM

యుద్ధ భారం వాహనదారులు మోయక తప్పదా? | ప్రీమియం మరియు పారిశ్రామిక ఇంధన పెరుగుదల అస్థిరత తర్వాత భారతదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి

వ్యాపారం

ఓయ్-చంద్రశేఖర్ రావు

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

మధ్య-తూర్పు ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. బ్యారెల్‌ ఒక్కింటికి 110-115 డాలర్ల మధ్య కదలాడుతున్నాయి. యుద్ధం ప్రారంభమైన తర్వాత దాదాపుగా 90 శాతం మేర ముడిచమురు ధరల్లో పెరుగుదల చోటు చేసుకుంది. ఈ పరిస్థితి దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయనే ఆందోళనలను పెంచుతోంది.

ఈ వారం అంతర్జాతీయ ట్రేడింగ్ ముగియడానికి ముందు వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ఆయిల్ ధరలు 95.55 డాలర్లు నుండి 2.27 శాతం పెరిగి 98.32 డాలర్లు/బ్యారెల్‌కు చేరాయి. అదే సమయంలో, బ్రెంట్ క్రూడ్ ధర 3.26 శాతం లాభపడి 112.19 డాలర్లు/బ్యారెల్‌కు చేరుకుంది. ఈ నెలలో ఇప్పటివరకు దేశ ఆయిల్ బాస్కెట్ సగటు ధర బ్యారెల్‌కు దాదాపు 117 డాలర్లుగా నమోదైంది.

ప్రీమియం మరియు పారిశ్రామిక ఇంధన పెరుగుదల అస్థిరత తర్వాత భారతదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి

ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, ఆయిల్ తయారీ కంపెనీలు (OMCs) శుక్రవారం పవర్ పెట్రోల్ ధరలను లీటర్‌కు 2.35 రూపాయల వరకు ఉన్నాయి. పారిశ్రామిక రంగానికి ఉపయోగించే బల్క్ డీజిల్ ధరలు లీటర్‌కు సుమారు 22 రూపాయల వరకు పెరిగాయి. వాహనదారులు, పొందే ప్రస్తుత వార్త, బైక్‌ కార్లలో ఉపయోగించే సాధారణ రిటైల్ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదు.

సామాన్య వినియోగదారులకు తక్షణ ప్రభావం లేనప్పటికీ, పారిశ్రామిక డీజిల్ ధరల పెంపు లాజిస్టిక్స్, పారిశ్రామిక వ్యయాలను పెంచవచ్చు. ఇది పరోక్షంగా ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపడం ఖాయం. ప్రస్తుతం ప్రభుత్వం అందజేతపై దృష్టి సారించింది. ముడి చమురు ధరలు పెరిగితే, భవిష్యత్తులో ఇంధన ధరలలో మార్పులు సంభవించవచ్చు. ప్రపంచ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇంధన ధరలపై నిశితంగా పర్యవేక్షించడం అవసరం.

ఈ పరిణామాల మధ్య వివిధ నగరాల్లో పెట్రోల్ రేట్ల వివరాలు ఉన్నాయి.

హైదరాబాద్ లో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 107.46

ఢిల్లీలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 94.77

కోల్కతాలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 105.41

ముంబైలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 103.54

చెన్నైలో పెట్రోల్ ధర: లీటరుకు రూ.101.06

భువనేశ్వర్‌లో పెట్రోల్ ధర: లీటరుకు రూ.100.94

డీజిల్ ధరలు ఇవీ..

హైదరాబాద్ లో డీజిల్ ధర: లీటరుకు రూ. 95.70,

ఢిల్లీలో డీజిల్ ధర: లీటరుకు రూ. 87.67

కోల్‌కతాలో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.02

ముంబైలో డీజిల్ ధర: లీటరుకు రూ. 90.03

చెన్నైలో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.61

భువనేశ్వర్‌లో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.52

ఆంగ్ల సారాంశం

అస్థిరత కారణంగా ప్రీమియం మరియు పారిశ్రామిక ఇంధనాల పెంపు తర్వాత భారతదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు స్థిరంగా ఉంటాయి. ఈ పెంపు వాహన వినియోగదారుల నుండి బలమైన ప్రతిస్పందనలను పొందింది, వీరిలో చాలామంది పెరుగుతున్న ఖర్చులు మరియు కొనసాగుతున్న ప్రపంచ ఉద్రిక్తతల కారణంగా తమ ఇంధన ఎంపికలను పునఃపరిశీలిస్తున్నారు. బ్యారెల్‌ ఒక్కింటికి 110-115 డాలర్ల మధ్య కదలాడుతున్నాయి.

Source link