seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 10 March 2026, 1:59 am Digital Edition : SEEMA KIRANAM

యుద్ధం ముగియలేదు.. ఇప్పుడే మొదలైంది! ప్రపంచ దేశాల్లో పెరుగుతున్న భయం! | ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ స్లీపర్ సెల్స్ హెచ్చరిక, ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం మధ్య ప్రపంచ భయం పెరిగింది, పూర్తి వివరాలు

అంతర్జాతీయ

ఓయ్-జక్కీ మహేష్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో ఇరాన్ అట్టుడుకుతుండగా.. తాజాగా ఇరాన్ నుంచి వచ్చిన ఓ రహస్య సంకేతం అంతర్జాతీయ నిఘా వర్గాలను కలవరపెడుతోంది. ఫిబ్రవరి 28న జరిగిన దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణానంతరం.. విదేశాల్లో ఉన్న ఇరాన్ ‘స్లీపర్ సెల్స్’పై యాక్టివేట్ కోసం ప్రయత్నించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఏమిటీ రహస్య సంకేతం?
అమెరికా నిఘా సంస్థ ఇరాన్ నుంచి ఉద్భవించినట్లు కొన్ని ఎన్‌క్రిప్టెడ్ కమ్యూనికేషన్‌లను గుర్తించాయి. విదేశాల్లో ఉన్న ఇరాన్ గూఢచారులు లేదా స్లీపర్ సెల్స్ కోసం పంపిన ‘ఆపరేషనల్ ట్రిగ్గర్’ కానెంట్ ఫెడరల్ అలర్ట్ హెచ్చరించింది. ఈ సందేశాలు ఇంటర్నెట్ లేదా మొబైల్ నెట్‌వర్క్‌లను ఉపయోగించకుండా పంపడం అవసరం. దీనివల్ల ఇవి ఎటువంటి డిజిటల్ గుర్తులు వదలకుండా చేరవేసేలా రూపొందించబడ్డాయి.

ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ స్లీపర్ సెల్స్ హెచ్చరిక ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం మధ్య ప్రపంచ భయం పెరిగింది

యుద్ధం కొనసాగుతోంది
ఈ సందేశాలు కేవలం డీక్రిప్షన్ కీ ఉన్న వ్యక్తులకు మాత్రమే అర్థమవుతాయని, ఇవి ఒక రకమైనవని నిపుణులు చెబుతున్నారు. ఈ ఖచ్చితంగా ఎక్కడ అటాక్ జరుగుతుందనే విషయాన్ని ఇవ్వకపోయినప్పటికీ, అంతర్జాతీయంగా అనుమానాస్పద రేడియో ఫ్రీక్వెన్సీ కార్యకలాపాలపై నిఘా పెంచాలని నిఘా వర్గ సంకేతాలు అందుతున్నాయి. ఖమేనీ మరణించారు యుద్ధం ఏమాత్రం తగ్గలేదు. ఇజ్రాయెల్ తాజాగా ఇరాన్ రాజధాని టెహ్రాన్, బెరూట్‌లోని హిజ్బుల్లా స్థావరాలపై దాడులు కొనసాగుతున్నాయి.

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పుడు 11వ రోజుకు చేరుకుంది. ఇరాన్ కూడా తన వంతుగా ఇజ్రాయెల్, అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణి, డ్రోన్ దాడులతో ఎదురుదాడి చేస్తోంది. ఆదివారం సౌదీ అరేబియాలోని నివాస ప్రాంతాలపై జరిగిన దాడిలో ఓ భారతీయుడు సహా ఇద్దరు మరణించారు. ఇరాన్ ఐక్యరాజ్యసమితి రాయబారి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ యుద్ధంలో ఇరాన్ దేశంలోనే ఇప్పటివరకు 1,332 మంది పౌరులు మరణించారు, వేల సంఖ్యలో గాయపడ్డారు.

ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా భద్రతాపరమైన ఆందోళనలను పెంచుతున్నాయి. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో ఇరాన్ స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయితే మరింత విషమించే అవకాశం ఉందని నిఘా సంస్థలు అప్రమత్తంగా ఉన్నాయి.

ఆంగ్ల సారాంశం

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం మరియు అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అవుతుందనే భయాన్ని ఇరాన్ నుండి వచ్చిన అనుమానిత ఎన్‌క్రిప్టెడ్ సిగ్నల్స్ కారణంగా గ్లోబల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు చాలా అప్రమత్తంగా ఉన్నాయి.

Source link