అంతర్జాతీయ
-డాక్టర్ వీణా శ్రీనివాస్
పశ్చిమాసియాలో వార్ కొనసాగుతుంది. ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ తమ దాడులను రోజురోజుకు తీవ్రతరం చేస్తోంది. మరోవైపు ఇరాన్ కూడా ప్రతి దాడులకు పాల్పడుతోంది. ఈ యుద్ధంలో డ్రోన్ లు, క్షిపణులను విస్తృతంగా వాడుతూ దాడులను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం యుద్ధం హోరాహోరీగా కొనసాగుతుంది.
పశ్చిమాసియాలో పదివేల డ్రోన్లు
ఇరాన్ పై అమెరికాజ్రాయిల్ తమ దాడులు కొనసాగుతున్నాయి. బ్లూమ్ బర్గ్ కథనం ప్రకారం యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా పశ్చిమాసియాలో పదివేల డ్రోన్లను మోహరించింది.

మెరోప్స్ ఇంటర్ సెప్టర్లు సరిగ్గా కూల్చివేసిన రక్షణ శాఖ
ప్రాజెక్టు ఈగల్ కింద గూగుల్ మాజీ సీఐఓ ఎరిక్ స్మిత్ సారధ్యంలోని ఓ రక్షణ సంస్థ మెరోప్స్ డ్రోన్ లను అభివృద్ధి చేసింది. వీటిని 2024లో ఉక్రెయిన్ యుద్ధంలో విస్తృతంగా ఉపయోగించారు. రష్యా ఇరాన్ షాహెద్ డ్రోన్లను ఉపయోగిస్తే, వాటిని మెరోప్స్ ఇంటర్ సెప్టెంబరు తగిన విధంగా కూల్చి వేసినట్టు రక్షణ శాఖ అధికారులు. ప్రస్తుతం ఇరాన్ షాహెద్ డ్రోన్లను ఉపయోగిస్తోంది.
ఇరాన్ షాహెద్ డ్రోన్లు, అమెరికా మెరోప్స్ డ్రోన్స్
వాటిని ప్రతిఘటించడం కోసం అమెరికా పెద్ద సంఖ్యలో మెరోప్స్ డ్రోన్లను ఉపయోగిస్తోంది. ఇరాన్ షాహెద్ డ్రోన్ తయారీకి దాదాపు 20వేల డాలర్లు ఖర్చు అవుతుంటే, మెరోప్స్ ఇంటర్ సెప్టెంబరు డ్రోన్ ఒక్కొక్కదానికి దాదాపు 14వేల డాలర్ల నుండి 15వేల డాలర్లు ఖర్చవుతుందని చెప్తున్నారు. అయితే వీటిని పెద్ద మొత్తంలో కొంటే ఒక్కొక్కటి 3 వేల డాలర్ల నుండి 5వేల డాలర్ల మధ్య లభిస్తుందని రక్షణ రంగ నిపుణులు వెల్లడిస్తున్నారు.
పశ్చిమాసియాలో అమెరికాకు చెందిన పదివేల డ్రోన్లు మోహరింపు
ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయిల్ అమెరికా యుద్ధంలో డ్రోన్లు, క్షిపణులు కీలక భూమిక పోషిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఖర్గ్ ఐలాండ్ పై దాడి విషయంలో ఇరాన్ అమెరికాకు చాలా గట్టి వార్నింగ్ ఇచ్చింది. మొత్తంగా యుద్ధంలో పదివేల డ్రోన్లను పశ్చిమాసియాలో అమెరికా మోహరించి యుద్ధం చేయడం ప్రధానంగా గుర్తించవలసిన అంశం.

