seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 12 February 2026, 7:18 am Digital Edition : SEEMA KIRANAM

మున్సిపల్ ఎన్నికల్లో ఏ స్థానంలో ఎవరిది గెలుపు, లెక్క పక్కా..!! | ఇటీవల జరిగిన ఎన్నికల్లో మెజారిటీ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను గెలుపొందడంపై కాంగ్రెస్ కాన్ఫిడెంట్‌గా ఉంది

తెలంగాణ

ఓయ్-సాయి చైతన్య

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

హోరా హోరీగా సాగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై స్పష్టత వస్తోంది. పోలింగ్ సరళి తరువాత పార్టీలు లెక్కల్లో మునిగిపోయారు. కార్పోరేషన్లు.. మున్సిపాలిటీల్లో పోలింగ్ జరిగిన తీరు… పోలింగ్ శాతం.. ఎంత మేర తాము నమ్ముకున్న ఓటర్లు ఓటింగ్ లో ఎక్కువ… పోల్ మేనేజ్ మెంట్ పైనా సమీక్షిస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన లెక్కలను బేరీజు వేస్తున్నారు. అంతిమం గా ఫలితాల పైన ఒక అంచనాకు వచ్చారు. పోలింగ్ జరిగిన తీరు పైన విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ మాత్రం 80 శాతం సీట్ల గెలుపుతో ధీమాగా మారింది.

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోరు ముగిసింది. ఈ నెల 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. దీనికి ముందే పార్టీలు పోలింగ్ సరళికి అనుగుణంగా గెలుపు ఓటముల పైన ఒక అంచనాలకు వస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ సైతం తమ అంచనాలు వెల్లడించాయి. పోలింగ్ తీరు పైన సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనలో పార్టీ అధ్యక్షుడు ఖర్గేకు నివేదిక ఇచ్చారు. 80 శాతం పైగా స్థానాలను పార్టీ గెలువబోతోందని చెప్పినట్లు సమాచారం. అదే విధంగా ఎగ్జిట్ పోల్స్ సైతం కాంగ్రెస్ కే అధికంగా సీట్లు వస్తాయని తేలింది. అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే సమయంలో రెండేళ్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి పట్టణ ఓటర్లు తమకే పట్టం కడతారని అధికార పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ జరిగిన ఎన్నికల్లో 80 స్థానాలకు పైగా స్థానాలు దక్కడం కాంగ్రెస్‌లో విశ్వాసం వ్యక్తం చేసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు దగ్గరగానే ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్-కాన్ఫిడెన్స్-ఓవర్-విన్నింగ్-మెజారిటీ-కార్పొరేషన్లు-మునిసిపాలిటీలు-ఇటీవలి-ఎన్నికలలో-పోలింగ్

మెదక్ జిల్లా మినహా అన్నింటా కాంగ్రెస్ అధికారం

ఉమ్మడి మెదక్, వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్,-కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ నెలకొంది. పుర పోరు వెలువడిన సమయం నుంచి ప్రచారం వరకు కాంగ్రెస్ పక్కా వ్యూహం తో ముందుకు సాగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి, పలు జిల్లాల్లో ప్రచార సభల్లో ఉన్నప్పుడు. సీఎం అమెరికాలో కనిపిస్తున్న జూమ్ మీటింగ్‌ల ద్వారా పార్టీ నేతలతో నిత్యం సమీక్షలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు ఉన్నాయని తేల్చి చెప్పారు. ఖమ్మం జిల్లాలోనూ ఏకపక్ష ఫలితాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని అంచనా వేస్తున్నారు. మెదక్ అనుకూల జిల్లా మినహా అన్నింటిలోనూ పార్టీకి ఉన్నట్లు జిల్లాకు చెందిన నేతలు చెబుతున్నారు. ఎన్నికలు జరుగుతున్న మొత్తం 116 మున్సిపాలిటీల్లో హస్తం పార్టీ ఏకంగా 84 గెలుచుకోనుంది. ఇక ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ 26, బీజేపీ 5, ఎంఐఎం ఒక్క మున్సిపాల్టీ గెలుచుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతల అంచనా. మెదక్‌లో బీఆర్‌ఎస్‌లో అత్యధిక మున్సిపాలిటీలు గెలిచే అవకాశం ఉందని విశ్లేషణలు చేస్తున్నారు. దీంతో.. అధికారిక ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.

ఆంగ్ల సారాంశం

రాష్ట్రవ్యాప్తంగా మునిసిపల్ ఎన్నికల్లో 80 శాతం సీట్లు గెలుస్తామన్న కాంగ్రెస్ విశ్వాసం, ఎగ్జిస్ పోల్స్ రాజకీయ వర్గాల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

Source link