ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన టీటీడీ ఈవో

ముఖ్యమంత్రికి తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అందజేసిన టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర అమరావతి , ఫిబ్రవరి 09, (సీమకిరణం న్యూస్): టీటీడీ ఈవోగా అదనపు బాధ్యతలు స్వీకరించిన సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర సీఎం క్యాంపు కార్యాలయంలో  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల టీటీడీ ఈవో గా అదనపు బాధ్యతలు స్వీకరించిన రవిచంద్ర సీఎంని కలిసి తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని అందించారు.