తెలంగాణ
oi-డాక్టర్ వీణా శ్రీనివాస్
<!--
--> <!-- -->జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాన్ని కుక్కలు పీకేసిన దారుణ ఘటన చోటు చేసుకుంది. మార్చురీలో ఉన్న మృతదేహాన్ని కుక్కలు పీక్కు తిన్న ఘటనపై అందరూ ఆసుపత్రిలో మార్చురీలో సిబ్బంది ఏమైపోయారు అని చర్చిస్తున్నారు. ఇక ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా వ మన వైద్య ఆరోగ్య వ్యవస్థలోని డొల్ల తనాన్ని సూచిస్తుంది. అయితే మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న సంఘటన దారుణమని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు.
ఆసుపత్రి మార్చురీని సందర్శించిన మాజీ మంత్రి లక్ష్మా రెడ్డి
గతంలో ఎప్పుడూ చూడని విధంగా మార్చురీ గదిలో మృతదేహాన్ని కుక్క పీక్కుతినడం వైద్య అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ,వంద పడకల ఆసుపత్రిని,నూతనంగా నిర్మించిన మార్చురీ బిల్డింగును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

బీఆర్ఎస్ పాలనలో ఆస్పత్రుల్లో అన్నీ ఉన్నాయన్న మాజీ మంత్రి
మార్చురీ గదిలో ఫ్రీజర్లు లేవని, మృతదేహాలను స్ట్రెచర్ పై కాకుండా నేలపై పెట్టడం దురదృష్టకరమని వస్తువులు. కాంగ్రెస్ ప్రభుత్వ ఆసుపత్రులను పట్టించుకోవడం లేదని. కనీస సౌకర్యాలు కల్పించక హాస్పిటళ్లు దీనావస్థకు చేరుకుంటున్నాయని వివరించారు. సౌకర్యాలు లేవు. మందులు లేవని దుయ్యబట్టారు..బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హాస్పిటళ్లను అన్ని రకాలుగా అభివృద్ధి చేశామని, కొత్త హాస్పిటల్స్ నిర్మించామన్నారు.
కొత్త మార్చురీ బిల్డింగ్ కాంప్లీట్ అయినా వాడుకోలేదు
పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించామని. పాత రోజులు తెస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిజం చేసింది.కొత్త హాస్పిటల్లో 2024 జూన్ లోనే మార్చురీ బిల్డింగ్ కాంప్లీట్ అయినా వాడుకోలేదని పేర్కొన్నారు. నిజంగానే మౌలిక సదుపాయాలు లేని, ఎవరినీ పట్టించుకోని పాతరోజులను తెచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మృతదేహం పీక్కుతిన్న ఘటనలో నలుగురు సస్పెన్షన్
ఇదిలా ఉంటే మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాన్ని కుక్కలు పీకేసిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపింది. విచారణ అనంతరం బాధ్యులైన నలుగురిని వైద్యారోగ్య శాఖ కమిషనర్ సస్పెండ్ చేశారు. పనిని మార్చే సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన కనిపించడం, విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే సహించలేదని.
ఆంగ్ల సారాంశం
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వాసుపత్రిలో వీధికుక్కలు మృతదేహాన్ని ఛిద్రం చేసిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది. విచారణ అనంతరం నలుగురు అధికారులను సస్పెండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి లక్ష్మా రెడ్డి విమర్శలు గుప్పించారు.