భారతదేశం
ఓయ్-చంద్రశేఖర్ రావు
<!--
--> <!-- -->తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ మహిళలకు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు. త్రిబుల్ బొనాంజా ప్రకటన. కలైజార్ మగళిర్ ఉరిమై తొగై పథకం కింద 1.31 కోట్ల మంది లబ్ధిదారులకు వారి ఖాతాల్లో ఒక్కొక్కరికి 5,000 రూపాయలు చొప్పున జమ చేశారు. ఇది- ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించిన మొత్తం. నెలకు 1,000 చొప్పున 3,000 రూపాయలతో పాటు ప్రత్యేక వేసవి సహాయం కింద మరో 2,000లు కూడా జమ చేశారు.
ఈ వైద్యుడు స్టాలిన్ స్వయంగా కలిగి. తన సోషల్ మీడియాలో మరో ముఖ్యమైన ప్రకటన చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తే, ద్రవిడ 2.0 పాలనలో కలైజ్ఞార్ మగళిర్ ఉరిమై తొగై పథకం కింద నెలవారీ హక్కుల గ్రాంట్ను రూ. 1,000 రూ. 2,000 లకు పెంచుతామని. మహిళల మద్దతుతో తాము ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తామనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 2023 సెప్టెంబర్లో ప్రారంభమైన పథకం ఇది. మాజీ ముఖ్యమంత్రి కలైజ్ఞార్ కరుణానిధి పేరుతో దీన్ని అమలులోకి వచ్చింది.

వారికి ఆర్థిక సాయంతో పాటు సమాజంలో మహిళలు చేస్తున్న కృషికి గుర్తింపుగా స్టాలిన్ ఈ సందర్భంగా అభివర్ణించారు. ఓ వీడియో క్లిప్పింగ్ ను విడుదల చేశారు. ఈ 5,000 రూపాయల మొత్తం మహిళలకు వారి రోజువారీ ఖర్చులు, కుటుంబ అవసరాలు, పిల్లల విద్యా ఖర్చులను చూడటానికి ఎంతగానో సహాయం చేస్తుంది. ఈ నెలవారీ సహాయాన్ని మూడు నెలల పాటు నిలిపివేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని, ఎన్నికలను సాకుగా చూపుతూ స్టాలిన్ వారిని అడ్డుకుంటున్నారని.
ఢిల్లీలోని ఓ పార్టీ, దానికి దాసోహమైన తమిళనాడులోని మరో పార్టీ ఈ కుట్రను పన్నుతున్నాయని స్టాలిన్. తమిళనాడు మహిళలకు ఇచ్చిన హామీని ఎవరు, ఎన్ని అడ్డంకులను సృష్టించినా ఆగబోదని, తాను వెనకడుగు వేయబోనని చెప్పారు. డబ్బు విడుదలను ఆపడానికి కొందరు న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించడానికి ప్రయత్నిస్తున్నారనే సమాచారం ఉంది. కుటుంబంలోని వ్యక్తిగా, మూడు నెలల పాటు ఈ నిలిపివేస్తేఎంత కష్టాలను ఎదుర్కొంటారో తెలుసునని.
అందుకే ముందుగానే ఈ విడుదల చేశానని స్టాలిన్ వివరించారు. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలవారీ 1,000 రూపాయల మొత్తానికి ప్రత్యేక వేసవి సహాయం కింద 2,00 రూపాయలను కలిపి మొత్తం 5,000 రూపాయలను 1.31 కోట్ల మంది మహిళలకు పంపిణీ ఆదేశాలు జారీ చేశానని, ఈ మొత్తం రాబోయే మూడు నెలలకు సరిపోతుందని పేర్కొంది.
ఆంగ్ల సారాంశం
కలైంజర్ మగళిర్ ఉరిమై తొగై పథకంలో 1.31 కోట్ల మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ. 5,000 చొప్పున జమ చేస్తూ సీఎం ఎంకే స్టాలిన్ శుక్రవారం భారీ బోనాంజా ఇచ్చారు. కాగా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలకు రూ.3,000.