seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 16 May 2026, 2:57 am Digital Edition : SEEMA KIRANAM

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలి

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలి

 

వెల్దుర్తి, మే 15, (సీమకిరణం న్యూస్):

 

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని, జి రామ్ జి చట్టాన్ని రద్దు చేయాలని తదితర డిమాండ్లపై అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘాలు దేశవ్యాప్త గ్రామీణ సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఈ సమ్మెను వెల్దుర్తి మండలంలోని నాగులవాగు వంకలో ఉపాధి హామీ పనులు జరిగే ప్రాంతాల్లో సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం (బి కే ఎం యు) ఆధ్వర్యంలో సమ్మెను జయప్రదం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ వెల్దుర్తి మండల కార్యదర్శి టి కృష్ణ ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి వెంకటేశ్వర్లు సిపిఐ సీనియర్ నాయకులు డి రాజు సిపిఐ పట్టణ కార్యదర్శి గిరిబాబు సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి చిన్నమాదులు సిపిఐ మండల నాయకులు శివ చరణ్ తేజ. చిన్న మాదన్న తదితరులు పాల్గొన్నారు.