seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 16 March 2026, 2:11 pm Digital Edition : SEEMA KIRANAM

మమత vs సువేందు.. దీదీ కంచుకోట బద్దలు..!! | మమతపై నేరుగా పోటీ చేయనున్న సువెందు – బీజేపీ పశ్చిమ బెంగాల్‌లో 144 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను బీజేపీ ప్రకటించింది.

భారతదేశం

ఓయ్-బొమ్మ శివకుమార్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

బెంగాల్ లో ఎన్నికల నగరా మోగింది. ఎలక్షన్ కమీషన్ ఎన్నికల తేదీని ప్రకటించిన మరుసటి రోజే బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. 144 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను ప్రకటించారు. ఈ మేరకు ఉత్తర, దక్షిణ బెంగాల్‌లోని పలు కీలక నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇక పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నియోజకవర్గం అయిన భవానీ పూర్ నుంచి రాష్ట్ర ప్రతిపక్షనేత సువేంధు అధికారి పోటీ చేయనున్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికల హీట్ అప్పుడే మొదలైంది. మార్చి 15 న బెంగాల్, కేరళ, తమిళనాడు, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే ఆ మరుసటి రోజే బీజేపీ తన తొలి జాబితాను. ఈ మేరకు 144 మందితో కూడిన జాబితాను తాజాగా విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఈ అభ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తదితరులు అగ్రనేతలు ఉన్నారు. గెలుపే లక్ష్యంగా క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం.

ఇక బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రాతినిథ్యం వహిస్తున్న భవానీపూర్ నియోజకవర్గం నుంచి రాష్ట్ర ప్రతిపక్షనేత సువేంధు అధికారి పోటీ చేయనున్నారు. మరోవైపు నందిగ్రామ్ నుంచి కూడా ఆయనే బరిలో నిలవనున్నారు. అయితే 2011 నుంచి భవానీపూర్ నియోజకవర్గం తృణమూల్ కాంగ్రెస్ కంచుకోటగా ఉంది. సువేందు అధికారి పోటీ చేయనున్న నేపథ్యంలో మరి ఈసారి కూడా టీఐఈ కోసం నిలబెట్టుకుంటుందా..? లేదా..? అన్నది తేలాల్సి ఉంది.

మమతతో నేరుగా పోటీ చేయనున్న సువెందు బీజేపీ పశ్చిమ బెంగాల్‌లో 144 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ప్రకటించింది.

ఇక పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. బెంగాల్‌లోని ప్రస్తుత శాసనసభ పదవీకాలం మే 7వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ తేదీలోపే అక్కడ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇక ఈ సారి కూడా టీటీడీ, బీజేపీ పార్టీల మధ్యే హోరాహోరీ జరిగే అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు ఏ మేరకు సీట్లు సాధిస్తాయో చూడాలి. బెంగాల్ లో పోలింగ్ ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో ఉంటుంది. ఇక కౌంటింగ్ మే 4 న జరగనుంది.

Source link