ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-చంద్రశేఖర్ రావు
ఏడు సంవత్సరాల బాలిక అత్యాచారం, హత్యోదంతం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. చిన్నారి ప్రాణం తీసిన ఈ ఘటన మన సమాజానికి మచ్చగా అభివర్ణించారు. రాష్ట్రంలో చట్టం-వ్యవస్థలు పూర్తిగా విఫలమైందనే దానికి ఇది నిదర్శనం. అమాయక బాలికను కాపాడలేని ప్రభుత్వం ప్రజలకు భద్రత ఎలా కల్పిస్తుందని ప్రశ్నించారు.
మదనపల్లి జిల్లా నీరుగట్టువారిపల్లిలో ఏడేళ్ల బాలికపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం హత్య చేసి, డ్రమ్ములో కుక్కిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన తెలుగుదేశ కూటమి ప్రభుత్వానికి సిగ్గు చేటని జగన్ ధ్వజమెత్తారు. బాలిక కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసినా, ఎందుకు కాపాడారని నిలదీశారు. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి, కడప జిల్లా మైలవరం మండలం కంబాలదిన్నె, తిరుపతి జిల్లా వడమాలపేటలో మూడున్నరేళ్ల చిన్నారిపై యువకుడు అత్యాచారం, హత్య ఉదంతాలను జగన్ గుర్తు చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం హడావిడి ప్రకటనలు చేయడం, ఆ తర్వాత ఆ పరీక్ష వదిలేయడం.. రొటీన్ అయిపోయిందని తేలింది.
చంద్రబాబును ఎవరైనా ప్రశ్నిస్తే వారు మాజీ మంత్రులు అయినా సరే వారి ఇళ్లమీద పోలీసులను పంపి ఒక వ్యూహంతో దాడులు చేయించడం, వారి ఆస్తులను ధ్వంసం చేయడం, వారిపై హత్యాయత్నాలు చేయడంపై ఉన్న శ్రద్ధ రాష్ట్రంలో బాలికలు, మహిళలకు రక్షణ కల్పించడంపై జగన్ దుమ్మెత్తిపోశారు. హోంమంత్రి లా అండ్ ఆర్డర్కు బాధ్యత వహించట్లేదని, నారా లోకేష్ తన శాఖలను నీరుగారుస్తూ, అందరి శాఖల్లో వేలుపెడతాడని, ఏ మంత్రి దేనికీ బాధ్యత వహించలేదని చెప్పారు.
చంద్రబాబుకు ప్రచారం తప్ప మరేమీ పట్టదని, ప్రభుత్వంలో ఉన్నవారికి ఇప్పుడు ఒకటే పని.. సొంత జేబులు నింపడం, పబ్లిసిటీ చేసుకోవడమేనని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. పొలిటికల్ గవర్నెన్స్, రెడ్బుక్ రాజ్యాంగంతో పోలీసు సహా వ్యవస్థలను కలుషితం చేస్తే ఇక లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుంది? ఎలా బతుకుతుంది? చిన్నారులకు, మహిళలకు ఎక్కడ నుంచి రక్షణ లభిస్తుందని జగన్ ప్రశ్నించారు.

