భారతదేశం
ఓయ్-బొమ్మ శివకుమార్
జమ్మూకాశ్మీర్ లోని కిష్ట్ వార్ ప్రాంతీయ మారుమూల ప్రాంతంలో భారత బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం అయ్యారు. వీరు జైషే- ఈ- మహమ్మద్(JEM) ఉగ్రవాద సంస్థకు చెందిన వారుగా పేర్కొన్నారు. వైట్ నైట్ కార్ప్స్ దళం తెలిపిన వివరాల ప్రకారం.. ‘ఆపరేషన్ త్రషి-1’లో భాగంగా జమ్మూకాశ్మీర్ లోని కిష్ట్ వర్ ప్రాంతంలో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. ఉగ్రవాదులను వెతికి పట్టుకుని హతమార్చేందుకు ఈ ఆపరేషన్ ను చేపట్టాయి.
అయితే జమ్మూకాశ్మీర్లోని కిష్ట్ వర్ ప్రాంతంలో ఉగ్ర కదలికలు కనిపిస్తున్నాయి జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఇంటెలిజెన్స్ బ్యూరోతో పాటు నిఘా వర్గాల నుండి సమాచారం అందిన నేపథ్యంలో ఉమ్మడి సెర్చ్ ఆపరేషన్. ఈ నేపథ్యంలో చత్రూ బెల్ట్లోని పస్సెర్ కుట్ ప్రాంతంలో ఫిబ్రవరి 22న భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వీళ్లు పాకిస్థాన్ కు చెందిన జైషే మహమ్మద్ సంస్థకు అనుబంధంగా ఉన్న సమాచారం.
‘ఆపరేషన్ త్రాషి-1’ భాగంగా ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు విజయవంతంగా మట్టుబెట్టాయి. అలాగే వారి వద్ద నుంచి రెండు ఏకే-47 రైఫిళ్లతో పాటు భారీగా పేలుడు పదార్థాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. హతమైన ఇద్దరు ఉగ్రవాదులు పాకిస్థాన్ జాతీయులని, నిషేధిత జైషే మహమ్మద్కు చెందిన వారుగా అధికారులు ధృవీకరించారు. అయితే పాస్సర్ కుట్ ప్రదేశంలో ఉండే మరికొందరు ఉగ్రవాదులకు అవకాశం ఉందన్న అనుమానంతో గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

ఇక గత నెల రోజులుగా చత్రూ ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు దాదాపు అనేకసార్లు ఎన్ కౌంటర్లు జరిగాయి. ఈ ఏడాది జమ్మూ డివిజన్లో ఇప్పటివరకు మొత్తం ఆరుగురు జైషే మహమ్మద్ ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఇదే విషయంపై ఇంతకుముందు వైట్ నైట్ కార్ప్స్ దళం సూచన.. ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారికి ఎక్కడా ఆశ్రయం లభించదు.

