అంతర్జాతీయ
-బొమ్మ శివకుమార్
<!--
--> <!-- -->ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి ఏడు నెలల్లో పాకిస్తాన్ బియ్యం ఎగుమతులు 40.5 శాతం తగ్గాయి 1.31 బిలియన్ డాలర్లు చేరాయి. భారత్.. అంతర్జాతీయ మార్కెట్లోకి తిరిగి రావడమే ఈ క్షీణతకు ప్రధాన కారణం. ఇది పాకిస్తాన్ మార్కెట్ వాటా, ధర నిర్ణయ సామర్థ్యాలను తీవ్రంగా ప్రభావితం చేసింది.
పాకిస్తాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ (PBS) నివేదిక ప్రకారం, బాస్మతియేతర బియ్యం ఎగుమతులు 50.8 శాతం తగ్గాయి 827.8 మిలియన్ డాలర్లకు చేరాయి. ఎగుమతి పరిమాణాలు గత ఏడాది 3.15 మిలియన్ టన్నుల నుండి 2.0 మిలియన్ టన్నులకు పడిపోయాయి. బాస్మతి బియ్యం ఎగుమతులు సైతం 6.62 శాతం క్షీణించి, 477.7 మిలియన్ డాలర్లు నిలిచాయి. వాటి పరిమాణం 487,278 టన్నుల నుండి 436,484 టన్నులకు తగ్గింది.
జాతీయ ఆహార భద్రతా మంత్రిత్వ శాఖ డిసెంబర్, జనవరి నెలల్లో జరిగిన పార్లమెంటరీ కమిటీ సమావేశాలలో వెల్లడించిన ప్రకారం, భారతీయ సరఫరాలు పెరగడం వల్ల పాకిస్తానీ బియ్యానికి పోటీతత్వం తగ్గి ఎగుమతుల తగ్గుదలకి కారణమైంది. భారత్ స్వేచ్ఛా వాణిజ్యందాల ద్వారా ప్రయోజనాలు, అలాగే దాని పరిశ్రమకు ప్రభుత్వ మద్దతు అధికంగా ఉండటం వల్ల పాకిస్తాన్ ఎగుమతిదారులపై మరింత ఒత్తిడిని పెంచుతోంది.

ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు పాకిస్తాన్ వాణిజ్య మంత్రిత్వ శాఖ గత నెలలో “డ్రాబ్యాక్ ఆఫ్ లోకల్ టాక్సెస్ అండ్ లెవీస్ ఫర్ రైస్ ఆర్డర్, 2026” కింద నోటిఫికేషన్ జారీ చేసింది. మెట్రిక్ టన్నుకు 750 డాలర్ల కంటే ఎక్కువ ధర కలిగిన బాస్మతి ఎగుమతుల ఫ్రీ-ఆన్-బోర్డు (FOB) విలువపై ఇది 9 శాతం రీబేట్ను అనుమతిస్తుంది. జనవరి 23న ప్రకటించిన ఈ పథకం ఎగుమతిదారుల నిధుల కొరతను తగ్గించి, దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడమే లక్ష్యం.
ఆంగ్ల సారాంశం
సంవత్సరం ప్రారంభ నెలల్లో పాకిస్తాన్ బియ్యం ఎగుమతులు గణనీయంగా పడిపోయాయని కథనం నివేదించింది, భారతదేశం మార్కెట్ ఉనికిని మరియు ధరల శక్తిని తిరిగి పొందడం ద్వారా నడిచింది. ఇది బాస్మతి మరియు బాస్మతీయేతర రవాణాపై ప్రభావాన్ని హైలైట్ చేస్తుంది మరియు ఎగుమతిదారుల నిధుల ఒత్తిళ్లకు ప్రతిస్పందనగా 2026 కోసం FOB విలువలపై ప్రభుత్వ రిబేట్ పథకాన్ని పేర్కొంది.