ఆంధ్ర ప్రదేశ్
ఓయ్-సాయి చైతన్య
<!--
--> <!-- -->బ్యాంకు పంపిణీకి బిగ్ అలర్ట్. వరుస సెలవుల పైన ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. ఈ సమయంలో బ్యాంకింగ్ లేకుండా సేవలకు అంతరాయం ప్రత్యామ్నాయ మార్గాల దిశగా వినియోగదారులు ఆలోచన చేయవలసి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ వారంలోనే మూడు రోజుల పాటు బ్యాంకులకు సెలవు ప్రకటించారు. ఇక, వచ్చే వారం శ్రీరామ నవమితో పాటు ఆర్దిక సంవత్సర ముగింపు కారణంగా మరో రెండు రోజులు బ్యాంకులకు సెలవుగా ఉండనుంది.
ఈ వారంలో మూడు రోజులు బ్యాకింగ్ సేవ పైన ప్రభావం పడనుంది. వరుస పండుగల కారణం గా బ్యాంకులకు సెలవు ప్రకటించారు. ఉగాది, రంజాన్ వంటి రెండు పెద్ద పండుగలు ఈ వారంలోనే ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగులకైతే వరుసగా 4 రోజులు సెలవులు రాబోతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉగాది సందర్భంగా మార్చి 19న సెలవు ప్రకటించింది. దీనితో పాటు రంజాన్ పండుగకు సంబంధించి మార్చి 21, మార్చి 22 తేదీలను సాధారణ సెలవులుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ సెలవులు చంద్ర దర్శనం ఆధారంగా మారే అవకాశం ఉంది. ఒకవేళ మార్చి 19న నెలవంక కనిపిస్తే, పండుగను మార్చి 20న జరుపుకుంటారు. అప్పుడు సెలవుల తేదీల్లో మార్పు ఉండనుంది. కాగా.. ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారం మార్చి 19, 21, 22 రోజుల్లో స్కూళ్లు, కాలేజీలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు వంటి వాటికి సెలవులు ప్రకటించారు.

బదిలీకి కీలక సూచనలు
ఇక, మార్చి 21 శనివారం. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు వీకెండ్. ఆ తర్వాత రోజు ఆదివారం మార్చి 22. ఎలా చూసుకున్నా ఈ వారంలో వరుసగా సెలవులు కనిపిస్తున్నాయి. అదే వచ్చే వారం కూడా బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. మార్చి 27 (శుక్రవారం) రోజున శ్రీరామనవమి కావటంతో తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేస్తారు. ఆ తర్వాత మార్చి 31 (మంగళవారం)న మహావీర్ జయంతి పండుగ. అయితే, అదే రోజు (మార్చి 31) ఆర్థిక సంవత్సరం చివరి రోజు కావడంతో బ్యాంకుల్లో వినియోగ దారులకు సేవలు అందుతాయి. సిబ్బంది తమ ఆర్దిక సంవత్సరం ఖాతాల ముగింపు లెక్కలకే పరిమితం అవుతారు. ఈ విధంగా, వినియోగదారులు… లావాదేవీలు నిర్వహించే వారు తమ ఆర్థిక ప్రణాళికలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని బ్యాంకు అధికారులు సూచిస్తున్నారు. బ్యాకింగ్ సదుపాయం కోసం వినియోగదారులకు బ్యాంకులు అందించే ప్రత్యామ్నాయ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
ఆంగ్ల సారాంశం
రంజాన్-ఈద్ (ఈద్-ఉల్-ఫితర్) ఉగాది, తెలుగు నూతన సంవత్సర దినోత్సవం కారణంగా మార్చి 21న భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి.