seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 22 May 2026, 2:36 pm Digital Edition : SEEMA KIRANAM

బెంగళూరులో రూ. 35 కోట్ల విలువైన డ్రగ్ పట్టివేత

బెంగళూరు, మే 22, (సీమకిరణం న్యూస్):

బెంగళూరులో పోలీసులు భారీ అంతర్జాతీయ డ్రగ్స్ నెట్వర్క్ను ఛేదించారు. నగరంలో అక్రమంగా రవాణా చేస్తున్న సుమారు రూ.35 కోట్ల విలువైన 17.50 కేజీల అత్యంత ప్రమాదకరమైన MDMA డ్రగ్ను పోలీసులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు సంబంధించి ఎనిమిది మంది నిందితులను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. యువతను లక్ష్యంగా చేసుకుని ఈ డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.