seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 12 February 2026, 2:47 am Digital Edition : SEEMA KIRANAM

బంగ్లాదేశ్ తలరాతను మార్చే ఎన్నికలు- ముమ్మరంగా పోలింగ్ | బంగ్లాదేశ్ ఎన్నికలు: ఢాకాలోని పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు పొడవాటి క్యూలైన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు

అంతర్జాతీయ

ఓయ్-చంద్రశేఖర్ రావు

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

దాదాపు రెండేళ్లుగా హింసాత్మక పరిస్థితులు, హిందువులపై దాడులతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. భారత కాలమానం ప్రకారం.. ఈ ఉదయం సరిగ్గా 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. బంగ్లాదేశ్ రాజకీయ చరిత్రలో అత్యంత కీలకమైన పార్లమెంటరీ ఎన్నికల పోలింగ్ ఇది. 2024 ఆగస్టులో విద్యార్థుల ఆందోళన, అప్పటి ప్రధానమంత్రి షేక్ హసీనా ఉద్వాసన, 15 ఏళ్ల పాలనకు ముగింపు పలికిన తర్వాత జరుగుతున్న మొదటి సాధారణ ఎన్నికలు ఇవి.

దేశవ్యాప్తంగా 42,000కు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 12.7 కోట్లమందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ ఎన్నికలతో- నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్ నిషేధానికి 18 నెలల తాత్కాలిక ప్రభుత్వానికీ తెరపడనుంది. ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇక అక్కడ ఏర్పడబోతోంది. ఈ ఎన్నికల ఫలితాలు.. ఆ దేశ భవిష్యత్తును ఖరారు చేస్తున్నాయి.

బంగ్లాదేశ్‌ ఎన్నికల నేపథ్యంలో ఢాకాలోని పోలింగ్‌ కేంద్రం వద్ద ఓటర్లు బారులు తీరారు

ఈ ఎన్నికలకు ముందు బంగ్లాదేశ్ రాజకీయ వాతావరణం పూర్తిగా మారింది. గత ఎన్నికల్లో ఆధిపత్యం వహించిన షేక్ హసీనా సారథ్యంలోని అవామీ లీగ్‌ను ఈసారి నిషేధించారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేయలేదు. తారిక్ రెహమాన్ నిషేధాన్ని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP), జమాతే ఇస్లామీ మధ్య ప్రధాన పోటీ. దీనితో పాటు 2024 ఆగస్టు నాటి విద్యార్థుల ఆందోళన నుంచి ఉద్భవించిన యువ నిషేధాన్ని నేషనల్ సిటీజన్ పార్టీ (NCP) కూటమి కూడా ఎన్నికల రణరంగంలో దిగింది.

హింస చెలరేగు అవకాశం ఉన్నందున లక్షలాదిమంది భద్రతా సిబ్బందిని మోహరింపజేశారు. ఈ ఎన్నికల్లో యువ ఓటర్ల ప్రభావం కీలకంగా మారుతుందనే అంచనాలు ఉన్నాయి. బంగ్లాదేశ్‌లో 18 నుంచి 37 ఏళ్ల మధ్య మొత్తం ఓటర్లలో దాదాపు 44 శాతం మంది ఉన్నారు. దేశ భవిష్యత్తును నిర్ణయించడంలో వారి ఓటింగ్ పాత్ర పోషించడం ఖాయంగా మారింది.

300 మంది పార్లమెంటు సభ్యుల ఎంపికతో పాటు, ఓటర్లు దేశ పాలనను మార్చే లక్ష్యంతో ప్రతిపాదించిన “జూలై చార్టర్” రాజ్యాంగ సంస్కరణల ప్రజాభిప్రాయ సేకరణలోనూ పాల్గొంటున్నారు. తొలిసారిగా- ప్రవాసులు, స్వయంగా ఓటు వేయలేని వారికి బ్యాలెట్‌లు బంగ్లాదేశ్‌లో అందుబాటులోకి వచ్చాయి. పోలింగ్ 4:30 గంటల వరకు కొనసాగుతుంది. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభమౌతుంది. రాత్రికి తొలి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.

ఆంగ్ల సారాంశం

బంగ్లాదేశ్ ఎన్నికలు: ఢాకాలోని పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు పొడవాటి క్యూలైన్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు

Source link