seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 10 March 2026, 11:32 pm Digital Edition : SEEMA KIRANAM

ప్లీజ్ మా నాన్న “ఏడో పెళ్లి” ఆపండి.. మైనర్ కొడుకు షాకింగ్ రిక్వెస్ట్ !! | ఉత్తరప్రదేశ్‌లో తన 7వ పెళ్లిని ఆపేయాలని మైనర్ బాలుడు తన తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వార్త వైరల్‌గా మారింది

భారతదేశం

-కొరివి జయకుమార్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్ జిల్లాలో ఒక ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. సాధారణంగా పిల్లలు తమ తల్లిదండ్రుల పెళ్లి వార్షికోత్సవాలను జరుపుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం 12వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి తన తండ్రి చేసుకోబోతున్న ఏడవ పెళ్లిని ఆపాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించడంలో చర్చనీయాంశమైంది. అలానే సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

పోలీసులకు ఫిర్యాదులో ఆ బాలుడు తెలిపిన వివరాల ప్రకారం.. అతని 55 ఏళ్ల తండ్రి ఇప్పటికే ఆరు సార్లు వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు మరోసారి పెళ్లి కోసం వెంటనే ఏర్పాట్లు చేస్తున్నాడని, ఈ పెళ్లిని ఆపాలని కోరుతూ అధికారులను వేడుకున్నాడు. తండ్రి నిర్ణయాల వల్ల కుటుంబ జీవితం పూర్తిగా దెబ్బతింటుందని బాలుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

ఉత్తరప్రదేశ్‌లో తన 7వ పెళ్లిని ఆపివేసినట్లు-తండ్రిపై మైనర్ బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కాగా బాలుడి తండ్రి 2024లో ఆరోసారి వివాహం చేసుకున్నాడు. అయితే ఆరవ భార్య భూమి, నగలు డిమాండ్ చేస్తూ కుటుంబంతో తరచూ గొడవలు పెట్టుకుని కొద్ది రోజులకే ఇంటిని విడిచి వెళ్లిపోయారు. అయినప్పటికీ గత అనుభవం నుంచి పాఠం నేర్చుకోకుండా తన తండ్రి మళ్లీ ఏడవ పెళ్లికి సిద్ధమవుతున్నాడని మైనర్ బాలుడు వాపోతున్నాడు.

ఇంకా ఆశ్చర్యకరమైన విషయం, ఫిర్యాదు చేసిన ఈ బాలుడు తండ్రి మూడవ భార్యకు పుట్టిన కుమారుడు. కుటుంబంలో ఇప్పటికే ఎన్నో సమస్యలు, తండ్రి వరుసగా వివాహాలు చేసుకోవడం వల్ల ఇంట్లో పరిస్థితి మరింత దిగజారిందని అతను తెలిపాడు. కేవలం వివాహాల సమస్య మాత్రమే కాకుండా, ఈ వ్యవహారం కుటుంబ ఆర్థిక పరిస్థితిని కూడా తీవ్రంగా ప్రభావితం చేసిందని బాలుడు పోలీసులకు వివరించాడు. ఏడవ పెళ్లి కోసం తన తండ్రి పూర్వీకుల భూమిని విక్రయించాలని నిర్ణయించుకున్నాడని, ఇప్పటికే దాదాపు ₹50,000 అడ్వాన్స్ తీసుకున్నాడని ఆరోపించాడు.

అంతేకాకుండా, తండ్రి ఇప్పటికే కుటుంబానికి చెందిన సగం భూమిని తాకట్టు పెట్టి అప్పులు తీసుకున్నాడని, ఆ అప్పుల భారాన్ని తానే భరించాల్సి వస్తోందని బాలుడు చెప్పాడు. ఈ పరిస్థితుల్లో మరో పెళ్లి జరిగితే కుటుంబం పూర్తిగా ఆర్థికంగా కూలిపోతుందని అతను ఆందోళన వ్యక్తం చేశాడు.

ఈ విషయం చిరాగ్ జైన్ దృష్టికి చేరడంతో పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు ఆ వ్యక్తి వివాహాలకు సంబంధించిన వివాహ రికార్డులు, భూమి విక్రయ ఒప్పందాలు, అప్పుల వివరాలు గత పత్రాలను పరిశీలిస్తున్నారు. అవసరమైతే సంబంధిత వ్యక్తులను విచారించి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఒక మైనర్ కుమారుడు తన కుటుంబాన్ని కాపాడేందుకు పోలీసులను ఆశ్రయించడం సమాజంలో పెద్ద చర్చకు దారితీసింది.

ఆంగ్ల సారాంశం

అనేక వివాహాలు చేసుకున్న తన 55 ఏళ్ల తండ్రి ఎనిమిదో పెళ్లికి ప్లాన్ చేయడంతో ఉత్తరప్రదేశ్‌లోని ఓ మైనర్ కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో సంభావ్య ఆస్తి వివాదాలు మరియు ఆర్థిక కష్టాలు ఉంటాయి, పరిశోధకులు వివాహం మరియు భూమి పత్రాలను సమీక్షిస్తారు.

Source link