ప్రమాదంలో నిండు ప్రాణాలు పోవడం బాధాకరం : మంత్రి మండిపల్లి
పల్నాడు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి. రోడ్డు ప్రమాదాల్లో నిండు ప్రాణాలు పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయాణాలు సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చాలే తప్ప, ఆఖరి మజిలీకి కాకూడదని అన్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు