ప్రజలకు 4వ పట్టణ పోలీసుల విజ్ఞప్తి
4వ పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ విక్రమ్ సింహ
కర్నూలు క్రైమ్, మే 02, (సీమకిరణం న్యూస్):
ఇళ్లలో పనిమనుషులు లేదా సహాయకులను నియమించుకునేటప్పుడు యజమానులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని 4వ పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ విక్రమ్ సింహ ప్రజలను విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇళ్లలో పని మనుషులను పనిలో చేర్చుకునే ముందే సమీప పోలీస్ స్టేషన్ ద్వారా ‘పోలీస్ వెరిఫికేషన్’ చేయించుకోవాలని పనివారి పూర్తి చిరునామా, ఆధార్ కార్డు మరియు ఫోటోలను దగ్గర ఉంచుకోవాలన్నారు. విలువైన వస్తువులను బీరువాలో భద్రపరుచుకుని, తరచూ వాటిని తనిఖీ చేస్తూ ఉండాలన్నారు. ఈ కేసును ఎస్ ఐ గోపినాథ్, ఎస్ ఐ చంద్ర శేఖర్ మరియు పిసీ మురళి, హెచ్ సి జీనస్, పీసీ సుబ్బారాయడులు విజయవంతంగా ఛేదించారు.