seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 13 September 2026, 3:53 pm Digital Edition : SEEMA KIRANAM

ప్రజలకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు : 4వ పట్టణ సీఐ విక్రమ సింహా

భక్తిశ్రద్ధలతో వినాయక చవితి జరుపుకోవాలి : 4వ పట్టణ సీఐ విక్రమ సింహా

 

 

కర్నూలు జిల్లా ప్రజలకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలిపిన 4వ పట్టణ సీఐ విక్రమ సింహా

 

కర్నూలు ప్రతినిధి, సెప్టెంబర్ 13 (సీమకిరణం న్యూస్):

 

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కర్నూలు జిల్లా ప్రజలకు కర్నూలు 4వ పట్టణ సీఐ విక్రమ సింహా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరి ఇళ్లలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. వినాయక చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఆయన కోరారు. పండుగ సందర్భంగా ప్రజలు పోలీసులకు సహకరిస్తూ శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా వేడుకలను నిర్వహించుకోవాలని సీఐ విక్రమ సింహా సూచించారు.