వ్యాపారం
ఓయ్-చంద్రశేఖర్ రావు
<!--
--> <!-- -->అమెరికా- ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. దాదాపుగా గల్ప్ దేశాలన్నీ దీని వల్ల ప్రభావితం అయ్యాయి. సౌదీ అరేబియా మొదలుకుని బహ్రెయిన్ వరకూ ఏది మినహాయింపు కాదు. ఈ పరిణామాలతో పెట్రోల్, డీజిల్ ధరలను కూడా కేంద్ర ప్రభుత్వం పెంచవచ్చనే ఊహాగానాలకు తెర లేచింది. పశ్చిమ ఆసియాలో ఘర్షణలు తీవ్రతరం కావడం, అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగడం దీనికి మరింత బలాన్ని ఇచ్చింది.
సరఫరా అంతరాయల భయాల మధ్య, బ్రెంట్ నార్త్ సీ క్రూడ్ బ్యారెల్కు అయిదు పెరిగింది. బ్యారెల్ ఒక్కటింకి 83.89 డాలర్లకు చేరింది. 2024 ఏప్రిల్ తర్వాత ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. యూఎస్ బెంచ్మార్క్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ లో సైతం క్రూడ్ ధర జంప్ అయింది. ఏకంగా 8.1 శాతం పెరిగి 88.31కి చేరింది. ఇది రికార్డు స్థాయి ధర.

ఈ మధ్యకాలంలో వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్లో ఈ స్థాయిలో ధరల పెరుగుదల చోటు చేసుకోలేదు. ఇది- దేశీయ పెట్రో రేట్లను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే డొమెస్టిక్ వంటగ్యాస్ రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో త్వరలో వీటి రేట్లను కూడా కేంద్రం సవరిస్తుందనే వార్తలు వెలువడుతున్నాయి.
ఈ పరిణామాల మధ్య వివిధ నగరాల్లో పెట్రోల్ రేట్ల వివరాలు ఉన్నాయి.
ఢిల్లీలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 94.77
కోల్కతాలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 105.41
ముంబైలో పెట్రోల్ ధర: లీటరుకు రూ. 103.54
చెన్నైలో పెట్రోల్ ధర: లీటరుకు రూ.101.06
భువనేశ్వర్లో పెట్రోల్ ధర: లీటరుకు రూ.100.94
డీజిల్ ధరలు ఇవీ..
ఢిల్లీలో డీజిల్ ధర: లీటరుకు రూ. 87.67
కోల్కతాలో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.02
ముంబైలో డీజిల్ ధర: లీటరుకు రూ. 90.03
చెన్నైలో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.61
భువనేశ్వర్లో డీజిల్ ధర: లీటరుకు రూ. 92.52
ఆంగ్ల సారాంశం
US ఇరాన్ పెరుగుదల మధ్య భారతదేశంలో పెట్రోల్ మరియు డీజిల్ రేట్లు మారవు ప్రధాన రాష్ట్రాలు నేడు ధరల పెంపుదల లేదు