పార్టీ బలోపేతం కోసం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పార్టీ బలోపేతంపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇకపై పార్టీ పదవులు, ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల్లో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నియోజకవర్గ ఇన్ఛార్జ్లు, జిల్లా అధ్యక్షులు, అధికార ప్రతినిధుల ఎంపికలో మహిళలకు ఎక్కువ అవకాశాలు కల్పించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ల నేపథ్యంలో ఇప్పటి నుంచే మహిళా నాయకత్వాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.