seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 04 February 2026, 4:13 pm Digital Edition : SEEMA KIRANAM

పారిశుద్ధ్య కార్మికురాలి నిజాయతీకి సూపర్‌ స్టార్‌ కానుక

పారిశుద్ధ్య కార్మికురాలి నిజాయతీకి సూపర్‌ స్టార్‌ కానుక

చెన్నై, ఫిబ్రవరి 04, (సీమకిరణం న్యూస్):

తనకు దొరికిన బంగారాన్ని పోలీసులకు అప్పగించిన పారిశుద్ధ్య కార్మికురాలి నిజాయతీని సూపర్ స్టార్ రజనీకాంత్ మెచ్చుకోవడంతో పాటు బంగారు గొలుసును కానుకగా అందించారు. చెన్నై మహానగర పాలకసంస్థలో కార్మికురాలిగా పనిచేస్తున్న పద్మ (50) ఇటీవల తనకు రోడ్డుపై దొరికిన 45 తులాల బంగారాన్ని పోలీసులకు అప్పగించి పలువురు మన్ననలు అందుకున్నారు. తాజాగా ఆమెను అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌ సన్మానించారు..