Thursday, March 5, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణపవన్, లోకేష్ లకు విద్యార్ధుల రిక్వస్ట్.. "మీకు దండం పెడతాం" అంటూ | విజయనగరం జిల్లా...

పవన్, లోకేష్ లకు విద్యార్ధుల రిక్వస్ట్.. “మీకు దండం పెడతాం” అంటూ | విజయనగరం జిల్లా రాయపాలెం గ్రామానికి చెందిన విద్యార్థులు రోడ్ల గురించి పవన్ కళ్యాణ్ మరియు లోకేష్‌లకు విన్నవించారు

📰 Generate e-Paper Clip


ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-కొరివి జయకుమార్

విజయనగరం జిల్లా ఎస్.కోట వారి మారుమూల గిరిజన గ్రామం రాయపాలెం విద్యార్థుల పరిస్థితి హృదయ విదారకంగా మారింది. “డిప్యూటీ సీఎం సార్.. మాకు రోడ్డు వేయండి.. మీకు దండం పెడతాం” అంటూ పసిమొగ్గలు చేస్తున్న విన్నపం ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది. ప్రతిరోజూ చదువు కోసం 12 సంవత్సరాల మేర అడవి మార్గంలో, కొండలు ఎక్కుతూ దిగుతూ పాఠశాలకు వెళ్లాల్సి రావడం వారి భవిష్యత్తుపై ప్రభావం చూపుతోంది.

ప్రాణాలతో పోరాడే ప్రయాణం..

విద్యార్థులు చూసే మార్గం రాళ్లు, మట్టి లోయలతో ప్రమాదకరంగా ఉండటమే కాకుండా వన్యప్రాణుల భయం కూడా వెంటాడుతోంది. వర్షాకాలంలో చిన్న వాగులు పొంగిపొర్లడంతో పాఠశాలకు వెళ్లడం మరింత కష్టమవుతోంది. కొందరు చిన్నారులు జారిపడి గాయపడిన ఘటనలు కూడా గ్రామస్థులు చెబుతున్నారు. దీంతో పిల్లలు బడికి వెళ్లే వరకు, తిరిగి వచ్చే వరకు తల్లిదండ్రులు ఆందోళనలోనే గడపాల్సి వస్తోంది.

విజయనగరం జిల్లాలో రాయపాలెం నుంచి విద్యార్థులు-పవన్-కల్యాణ్, లోకేష్‌లకు అభ్యర్థన

అత్యవసర పరిస్థితుల్లో డోలీలే దిక్కు..

రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల గర్భిణీలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఆసుపత్రికి చేరుకోవడం పెద్ద సవాలుగా మారింది. అత్యవసర పరిస్థితుల్లో గ్రామస్తులు డోలీలలో మోసుకుంటూ కొండ దారులు దాటాల్సి వస్తోంది. వైద్య సేవలు ఆలస్యమవడం వల్ల ప్రాణాపాయం ఏర్పడిన సందర్భాలు ఉన్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దూర ప్రయాణం కారణంగా కొంతమంది చిన్నారులు మధ్యలోనే చదువు మానేస్తున్నారని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్న తరగతుల పిల్లలు, బాలికలు ఈ కష్టాలను భరించలేక విద్యకు దూరమవుతున్నారు. పాఠశాలకు సమయానికి చేరుకోలేక హాజరు తగ్గిపోవడం కూడా మరో సమస్యగా మారింది.

పవన్, లోకేష్ లకు విద్యార్థుల వినతి..

గ్రామస్తులు పలుమార్లు అధికారులు కలిసినా స్పష్టమైన పరిష్కారం రాలేదని చెబుతున్నారు. వలసలు, అనుమతుల పేరుతో పనులు వాయిదా పడుతున్నాయని ఆరోపిస్తున్నారు. దశాబ్దాలుగా పాలకులు మారిన తమ గ్రామ పరిస్థితి మారలేదని గిరిజనులు వాపోతున్నారు. తమకు పెద్ద సౌకర్యాలు లేవు, కేవలం చదువుకోవడానికి ఒక రహదారి అవసరం కోసం విద్యార్థులు వేడుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ తీసుకుని క్లియరెన్స్ వంటి సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించి రోడ్డు పనులు ప్రారంభించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

అభివృద్ధి నగరాలకు మాత్రమే పరిమితం కాకుండా తమలాంటి అడవి గ్రామాలకూ చేరాలని గిరిజనులు ఆశిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో తమ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని వారు విశ్వసిస్తున్నారు. 12 కష్టమైన ప్రయాణానికి స్వస్తి పలికి, నాణ్యమైన రహదారి ఏర్పడితే పిల్లల భవిష్యత్తు మారుతుందని గ్రామస్థులు.





Source link

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular