seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 03 March 2026, 6:03 am Digital Edition : SEEMA KIRANAM

పవన్ కల్యాణ్ బ్రెయిన్ ఛైల్డ్ ప్రాజెక్ట్ హనుమాన్- వాలంటీర్లుగా స్థానిక యువకులు | వాలంటీర్లు మరియు కుమ్కీ ఏనుగులతో వన్యప్రాణుల నుండి గ్రామాలను రక్షించడానికి AP ప్రాజెక్ట్ హనుమాన్‌ను పరిచయం చేసింది

ఆంధ్ర ప్రదేశ్

ఓయ్-చంద్రశేఖర్ రావు

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్ట్ హనుమాన్ ను ప్రారంభించింది. ఏపీలో ఈ తరహా ప్రాజెక్ట్ అమలులోకి రావడం ఇదే ప్రథమం. కొద్దిసేపటి కిందటే పవన్ కల్యాణ్ మంగళగిరిలో ఈ నిదర్శనం. అనంతరం ఆయన ప్రసంగించారు.

మానవ- వన్యప్రాణి సంఘర్షణను నివారించడం కోసం ఈ హనుమాన్ ప్రాజెక్ట్ రూపకల్పన చేశామని పవన్ కల్యాణ్ అన్నారు. దీన్ని సమగ్ర సాంకేతిక, పథకంగా అభివర్ణించారు. చిత్తూరు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఎక్కడైతే ఏనుగులు, ఇతర వన్యప్రాణులు గ్రామాల్లోకి వెళ్లి ప్రజల ప్రాణాలకు, వ్యవసాయానికి ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు ఉన్నాయని, అలాంటి చోట్ల వీటిని ఎలా అదుపు చేయాలనే ఆలోచన నుంచే ఇది పుట్టిందని పేర్కొన్నారు.

వాలంటీర్లు మరియు కుమ్కీ ఏనుగులతో వన్యప్రాణుల నుండి గ్రామాలను రక్షించడానికి AP ప్రాజెక్ట్ హనుమాన్‌ను పరిచయం చేసింది

ఒకవంక వన్యప్రాణులను సంరక్షిస్తూనే మరోవంక వాటి బారి నుండి ప్రజల ప్రాణాలు, పంటలు, పశువులు, ఆస్తులను పరిరక్షించడమే ఈ హనుమాన్ ప్రాజెక్ట్ ప్రధాన కర్తవ్యమని పవన్ కల్యాణ్ చెప్పారు. పరిస్థితులు తలెత్తినప్పుడు వెంటనే స్పందించడం, కావాల్సిన ఉపశమన చర్యలు తీసుకోవడం, పరిహారం చెల్లింపుల కోసం ఇప్పటివరకు ఇటువంటి ఒక వ్యవస్థ లేదు, ఈ హనుమాన్ ప్రాజెక్ట్‌తో ఈ కొరత తీరడం లేదు.

దీనికోసం గ్రామీణ స్థాయంలో పంచాయితీరాజ్, వ్యవసాయం, ఉద్యాన వనాలు, పోలీస్ శాఖలతో పాటు ఇతర విభాగాలతో సమన్వయం చేసుకుంటామని, ఈ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారి జీపీఎస్ ట్రాకింగ్ వంటి పూర్తి సాంకేతికతతో కూడిన 100 వాహనాలను ప్రారంభించామని గుర్తుచేశారు. ఇందులో 93 రాపిడ్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ టీం వెహికల్స్, వైల్డ్ లైఫ్ అంబులెన్సు ఏడు ఉన్నాయని తెలిపారు.

వీటికి అనుసంధానంగా విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతిలో నాలుగు వైల్డ్ లైఫ్ రెస్క్యూ అండ ట్రీట్‌మెంట్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తున్నామని పవన్ వివరించారు. వన్యజీవి రక్షక్ అనే వాలంటనీ ఇన్‌స్టాల్ చేయబోతున్నామని, వారికి రెస్క్యూ కిట్లు అందిస్తున్నామని చెప్పారు. గ్రామస్థాయిలో పాములు, ఇతర జంతువుల నుండి ఎదురయ్యే సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా శిక్షణ ఇస్తున్నామని అన్నారు. వాలంటీర్లుగా స్థానిక యువతకు అవకాశాలు ఉన్నాయని పవన్ స్పష్టం చేశారు.

ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వన్యప్రాణుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి, నష్టపోయిన పంటలకు ఇచ్చే నష్టపరిహారాన్ని పెంచామని, అంతకు ముందు అయిదు లక్షల రూపాయలు ఉంటే తాము వచ్చాక 10 లక్షలకు పెంచామని గుర్తు చేశారు. గాయపడినవారికి పరిహారం లక్షలు రెండు నిర్ణియించామని చెప్పారు. పశువులు చనిపోతే మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం చెల్లిస్తున్నామని అన్నారు.

చిత్తూరు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఏనుగుల సమస్య తీవ్రంగా ఉందని, ఈ సమస్య పరిష్కారానికి కర్ణాటక ప్రభుత్వ సహకారంతో నాలుగు కుంకీ ఏనుగులను తీసుకొచ్చామని అన్నారు. ఇప్పటివరకు ఎనిమిది ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేసి ఏనుగుల నుండి ప్రజలకు, పంటలకు రక్షణ కల్పించామని ఆయన వివరించారు.

ఆంగ్ల సారాంశం

వాలంటీర్లు మరియు కుమ్కీ ఏనుగులతో వన్యప్రాణుల నుండి గ్రామాలను రక్షించడానికి AP ప్రాజెక్ట్ హనుమాన్‌ను పరిచయం చేసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ప్రాజెక్ట్ హనుమాన్ (వైల్డ్ లైఫ్ పర్యవేక్షణ, సహాయం మరియు నర్సింగ్ యూనిట్ల కోసం వైద్యం మరియు సంరక్షణ యూనిట్లు) ప్రారంభించారు. ప్రాజెక్ట్ హనుమాన్ ను ప్రారంభించింది. ఏపీలో ఈ తరహా ప్రాజెక్ట్ అమలులోకి రావడం ఇదే ప్రథమం. కొద్దిసేపటి కిందటే పవన్ కల్యాణ్ మంగళగిరిలో ఈ నిదర్శనం.

Source link