seemakiranam.com
Newspaper Banner
Date of Publish : 11 February 2026, 2:06 pm Digital Edition : SEEMA KIRANAM

పని-జీవిత సంతులనం: వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ! చైనాకూ, మనకూ ఎంత తేడా ? | వర్క్-లైఫ్ బ్యాలెన్స్ డిబేట్: చైనీస్ వ్యవస్థాపకుడి వీక్షణ భారతీయ వ్యవస్థాపకుడిని మాట్లాడకుండా చేస్తుంది

పని-జీవిత సమతౌల్యత విషయంలో భారతీయులకూ, చైనీయులకూ పూర్తిగా తేడా ఉంది. చైనా ఓ భారతీయ సీఈవోకు వ్యాపారవేత్త ఇచ్చిన సమాధానం చర్చకు దారి తీస్తోంది.

భారతదేశం

-సయ్యద్ అహ్మద్

<!--

--> <!--
Google Oneindia TeluguNews
-->

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులపై ఎప్పుడూ పని ఒత్తిడి ఉంటుంది. కార్పోరేట్ సంస్థల ఉద్యోగుల పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. భారత్ వంటి భారీ మార్కెట్ కలిగిన దేశాల్లో ఉద్యోగులు అటు ఉద్యోగాన్ని, ఇటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ (వర్క్-లైఫ్ బ్యాలెన్స్) చేయలేక పడే ఇబ్బందులు అంతా ఇంతా కాదు. కానీ మన పొరుగునే ఉన్న చైనాలో ఉద్యోగులు మాత్రం ఈ సమస్యకు వెతుక్కున్న పరిష్కారం ఏంటో చూస్తే మన వాళ్లకు కచ్చితంగా ఆశ్చర్యం అనిపించింది. ఇలాంటిదే ఓ ఘటన తాజాగా జరిగింది.

పని-జీవిత సమతౌల్యత (పని-జీవిత సమతుల్యత)

భారత్ కు చెందిన ఎనర్జీ ఏఐ ల్యాబ్స్ వ్యవస్థాపకుడు, సీఈవో శుభం మిశ్రా.. తన కొత్త చైనీస్ పార్టనర్ తో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పై ఎక్స్ లో జరిపిన సంభాషణను షేర్ చేశారు. ఇందులో భారత్, చైనా సంస్కృతుల్లో అతిపెద్ద తేడా ఏమిటని మిశ్రా ప్రశ్నించగా.. ఆ చైనీస్ వ్యాపారవేత్త తాత్వికంగా సమాధానం ఇస్తాడని అనుకున్నారు. కానీ దానికి బదులు అత్యంత నిష్కర్షగా, ఆచరణాత్మకమైన జవాబు ఇచ్చారు. దీంతో ఆశ్చర్యపోవడం మన సీఈవో గారి వంతయింది.

వర్క్-లైఫ్ బ్యాలెన్స్ డిబేట్ చైనీస్ వ్యాపారవేత్తల వీక్షణ భారతీయ వ్యవస్థాపకుడిని మాట్లాడకుండా చేస్తుంది

ఏదో ఒక్కటే మేలంటున్న చైనా

ఆ చైనీస్ వ్యాపారవేత్త మాట్లాడుతూ.. తాము వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పై ఆన్ లైన్ లో జరిగే చర్చలను నమ్మబోమన్నారు. ఉన్నవి కేవలం రెండు విషయాలు మాత్రమేనని, పని సమయం లేదా వ్యక్తిగత సమయం అని తేల్చేశారు. ఈ సలహా నిష్ఠూరంగా ఆచరణాత్మకమైనదిగా మిశ్రాకు అనిపించింది. దీని ప్రకారం భారతీయులు సిద్ధతను ఊహించుకుంటే, చైనీయులు వేగంగా, పని స్పష్టంగా చేస్తారని ఆయన ప్రకటించారు. అంటే ఈ రెండింటినీ పోల్చుకోలేని విషయాలుగా తేల్చేశారు.

వర్క్-లైఫ్ బ్యాలెన్స్ డిబేట్ చైనీస్ వ్యాపారవేత్తల వీక్షణ భారతీయ వ్యవస్థాపకుడిని మాట్లాడకుండా చేస్తుంది

ఆన్ లైన్ లో విస్తృత చర్చ

ఆన్ లైన్ లోనూ విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఒక వినియోగదారుడు కొన్నిసార్లు బ్యాలెన్స్ అంటే సమయాన్ని విభజించడం కాదని, ఏ క్షణంలో దేనికి శ్రద్ధ అవసరమో నిర్ణయించుకోవడని అభిప్రాయపడ్డారు. ఇంకొందరు ఆయనతో విభేదిస్తూ.. అమెరికా, బ్రిటన్ వంటి పాశ్చాత్య దేశాలు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కు ప్రాధాన్యతనిచ్చినా విజయవంతమయ్యారని, లేకపోతే అది కేవలం వేతన రహిత శ్రమగా మిగులుతుందని వాదించారు. ఈ చర్చల వేళ భారత్ లోనూ ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి చెప్పిన వారానికి 70 గంటల పని విధానం కూడా తెరపైకి వస్తోంది.

ఆంగ్ల సారాంశం

చర్చ, పని జీవిత సమతుల్యత కోసం భారతీయ మరియు చైనీస్ విధానాలను పోల్చి, చైనాలో 996 సంస్కృతిని హైలైట్ చేస్తుంది మరియు భారతదేశంలో పొడిగించిన గంటలు, మానసిక ఆరోగ్య ప్రభావాలు మరియు కార్యాలయ శ్రేయస్సును మెరుగుపరచడానికి స్పష్టమైన సరిహద్దులు మరియు శ్రేయస్సు మద్దతు వంటి ఆచరణాత్మక చర్యలు.

Source link